అనేక కార్యక్రమాలతో సంక్షేమానికి భరోసా
సీనియర్ సిటీజన్లను వేధిస్తే కఠిన చర్యలు
మంత్రి కొప్పుల ఈశ్వర్
గొల్లపల్లి, జూలై 4: ‘దివ్యాంగుల, వయో వృ ద్ధులకు టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా నిలుస్తున్నది. సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తూ అనేక పథకాలతో భరోసా కల్పిస్తున్నది’ అని మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. గొల్లపల్లి మండలం ఆత్మకూర్ గ్రామం లో సోమవారం నిర్వహించిన భాషా సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దివ్యాంగులు, వయో వృద్ధుల హెల్ప్లైన్ టోల్ ఫ్రీ నంబర్ల గోడ పత్రికను ఆవిష్కరించా రు. అనంతరం మంత్రి మాట్లాడారు. దివ్యాంగుల, వయో వృద్ధుల అభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలిపారు.
దివ్యాంగుల మ్యారేజ్ ఇన్సెంటివ్ అవార్డుల పథకం కింద ఆర్థిక స్వావలంభన కల్పిస్తున్నామని, ఇంకా ఉపకరణాలు అందించడంలో కృషి చేస్తున్నామన్నారు. విద్యా, ఉపాధి అవకాశాలు, ఆరోగ్య భద్రత, మౌలిక వసతుల కోసం బహుముఖ పద్ధతుల్లో కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. వృద్ధులను వేధించిన, పోషణను పట్టించుకోని పిల్లలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వృద్ధులు అత్యవసర సాయానికి హెల్ప్లైన్ నంబర్ 14567, దివ్యాంగులు 180057 28980 టోల్ఫ్రీ నంబర్కు కాల్ చేస్తే సంబంధిత అధికారులు వచ్చి తగు చర్యలు తీసుకుంటారని చెప్పారు. జడ్పీ అధ్యక్షురాలు దావ వసంత మాట్లాడుతూ ప్రజ ల క్షేమం కోసం తాము ఎంతగానో కృషి చేస్తున్నామని వివరించారు. కార్యక్రమంలో వయో వృద్ధుల, దివ్యాంగుల సంక్షేమశాఖ ఫీల్డ్ రెస్పాన్స్ ఆఫీసర్స్ పాదం తిరుపతి, మతులాపురం కొండ య్య, జడ్పీటీసీ జలందర్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రమేశ్, ఒగ్గు కళాకారులు ఉన్నారు.