జగిత్యాల అర్బన్, జూలై 15: మెరుగైన వైద్యమందించడమే తెలంగాణ సర్కారు లక్ష్యమని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి హరీశ్రావు అన్నారు. విరివిగా నిధులు వెచ్చిస్తూ వైద్యశాలల్లో సకల సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు. అన్ని రకాల పరీక్షలను ఉచితంగా చేస్తున్నామని, ప్రజలు ప్రైవేట్ దవాఖానలకు ఆశ్రయించవద్దని సూచించా రు. శనివారం ఆయన జగిత్యాలలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించారు. వార్డుల్లో కలియదిరిగారు. ప్రసవం కోసం వచ్చిన గర్భిణులు, చికిత్స పొందుతున్న బాలికలతో మా ట్లాడారు. వారి ఆరోగ్య వివరాలు తెలుసుకున్నా రు. ఎంసీహెచ్లో వసతులు, అందిస్తున్న వైద్య సే వలపై ఆరా తీశారు. ఎకడైనా లోపాలున్నా యా..? మందులు సక్రమంగా అందుతున్నా యా..? వైద్యం బాగుందా..? అని పేషెంట్లను అడి గి తెలుసుకున్నారు. ‘ఏమైనా లోపాలుంటే సరిదిద్దుకుంటాం. నిర్భయంగా చెప్పండి’ అని అడిగా రు. అయితే రోగులు.. అన్ని వసతులు బాగున్నాయని, అన్ని రకాల పరీక్షలు, అవసరం మేరకు మందులు ఇస్తున్నారని చెప్పారు. అనంతరం పిల్లల ఇన్ పేషెంట్ వార్డును సందర్శించి మంత్రి అందులో అడ్మిట్ అయిన పిల్లల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.
అనంతరం వైద్యుల హాజరు పట్టికను తనిఖీ చేశారు. తదనంతరం సూపరిం టెం డెంట్, వైద్యులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తొమ్మిది గంటల నుం చి నాలుగు గంటల వరకు విధుల్లో లేని డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్, సూపరింటెండెంట్ను ఆదేశించారు. అనధికారికంగా లీవులు పెట్టిన వారిని మందలించాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో వైద్యులు అందుబాటులో లేకుంటే పేషెంట్లు తీవ్ర ఇబ్బందులు ఎదురోవాల్సి వస్తుందని, అలాంటి పరిస్థితి రాకుండా వైద్యులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. బయోమెట్రిక్ పద్ధతిలో హాజరు నమోదుచేయాలని కలెక్టర్, సూపరింటెండెంట్లను ఆదేశించారు. స్వరాష్ట్రం లో అన్ని జిల్లాల్లో వైద్య కళాశాలల ఏర్పాటు చేయడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ముందుకెళ్తున్నారని పేర్కొన్నారు. అందులో భాగంగా జగిత్యాల జిల్లా లో ప్రభుత్వ వైద్య కళాశాలను ఏర్పాటు చేశారని చెప్పారు. ఇప్పటికే అన్ని సూపర్ స్పెషాలిటీ విభాగాలకు సంబంధించి పరికరాలను, వైద్యులను, ప్రొఫెసర్లను, అసిస్టెంట్ ప్రొఫెసర్లను, అసోసియేట్ ప్రొఫెసర్లను నియమించామన్నారు. కార్యక్రమం లో జడ్పీ చైర్పర్సన్ దావ వసంత, ఎమ్మెల్యేలు డాక్టర్ సంజయ్కుమార్, కల్వకుంట్ల విద్యాసాగర్రావు, కలెక్టర్ యాస్మిన్ బాషా పాల్గొన్నారు.