రాష్ట్రంలోనే వంద శాతం రెండు డోసుల వాక్సినేషన్ పూర్తి చేసుకున్న జిల్లాగా కరీంనగర్ రికార్డు క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. సౌత్ ఇండియాలో బెంగళూరు అర్బన్ జిల్లా 100 శాతం రెండు డోసులు పూర్తి చేసుకున్న తొలి జిల్లా కాగా.. రెండో జిల్లాగా కరీంనగర్ నిలిచింది. ఈసందర్భంగా కరీంనగర్ జిల్లా ప్రజలకు, ఇందుకోసం కృషి చేసిన మంత్రి గంగుల కమలాకర్, కలెక్టర్ ఆర్వీ కర్ణణ్, ఇతర ఆరోగ్య సిబ్బంది, ప్రజాప్రతినిధులను మంత్రి హరీశ్ రావు అభినందనలు తెలియజేశారు.
100 శాతం రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తి అయిన సందర్భంగా కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో మంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు.