రాష్ట్రంలోనే వంద శాతం రెండు డోసుల వాక్సినేషన్ పూర్తి చేసుకున్న జిల్లాగా కరీంనగర్ రికార్డు క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. సౌత్ ఇండియాలో బెంగళూరు అర్బన్ జిల్లా 100 శాతం రెండు డోసులు పూర్తి చేసుకున్న తొలి జిల్లా కాగా.. రెండో జిల్లాగా కరీంనగర్ నిలిచింది. ఈసందర్భంగా కరీంనగర్ జిల్లా ప్రజలకు, ఇందుకోసం కృషి చేసిన మంత్రి గంగుల కమలాకర్, కలెక్టర్ ఆర్వీ కర్ణణ్, ఇతర ఆరోగ్య సిబ్బంది, ప్రజాప్రతినిధులను మంత్రి హరీశ్ రావు అభినందనలు తెలియజేశారు.
రెండు డోసుల కరోనా వాక్సినేషన్ 100 % పూర్తి చేసిన తొలి జిల్లాగా నిలిచిన సందర్భంగా కరీంనగర్ జిల్లా ప్రజలకు, ఇందుకోసం కృషి చేసిన మంత్రి గంగుల కమలాకర్ గారు, కలెక్టర్ ఆర్.వి. కర్ణణ్ గారు, ఇతర ఆరోగ్య సిబ్బంది, ప్రజాప్రతినిధులకు ప్రత్యేక అభినందనలు. https://t.co/l9Mj0tIQWr
— Harish Rao Thanneeru (@trsharish) January 26, 2022
100 శాతం రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తి అయిన సందర్భంగా కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో మంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు.
With constant support & guidance of Hon’ble #CMKCR Garu, Karimnagar district is now 100% vaccinated against #COVID19 with successful administration of 1st & 2nd dose. It is the first district in Telangana & second in south India to be fully vaccinated with both the doses 1/2 pic.twitter.com/wUd25OI1r6
— Harish Rao Thanneeru (@trsharish) January 25, 2022