చిత్తశుద్ధి ఉంటే ప్రధాని ఇంటి ఎదుట కలిసి దీక్ష చేద్దాం
బీసీల సమస్యలపై దీక్ష చేసే దమ్ముందా
మంత్రి గంగుల కమలాకర్
నియోజకవర్గ అభివృద్ధికి నాలుగు పైసలు తెచ్చావా : రసమయి బాలకిషన్
డ్రామా దీక్ష : సుంకె రవిశంకర్
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కపట దీక్షలు మానుకోవాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ హితవుపలికారు. సమాజంలో 56 శాతం ఉన్న బీసీల సమస్యల పరిష్కారంపై చిత్తశుద్ధి ఉంటే.. ప్రధాని మోదీ ఇంటి ఎదుట బండితో కలిసి దీక్ష చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని, దమ్ముంటే సంజయ్ ముందుకు రావాలని సవాల్ విసిరారు. సోమవారం కరీంనగర్లోని మీ సేవా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ‘బండి చేసిన మౌన దీక్షపై’ మండిపడ్డారు. ఎంపీగా కరీంనగర్ నియోజకవర్గ అభివృద్ధి కోసం నాలుగు పైసలైనా తెచ్చావా..? చెప్పాలంటూ మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ప్రశ్నించగా.. అది మౌన దీక్ష కాదని, డ్రామా దీక్షా అని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ విమర్శించారు.
కరీంనగర్, జూలై 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): బీసీ బిడ్డగా ఉన్న బండి సంజయ్.. బీసీ సమస్యల పరిష్కారం కోసం ప్రధాని ఇంటి ఎదుట దీక్ష చేయాలని మంత్రి గంగుల హితవుపలికారు. సోమవారం కరీంనగర్ మీసేవా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీలకు చట్ట సభల్లో రిజర్వేషన్ కావాలని, బీసీలకు కేంద్రం లో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, కులగణన వెంటనే చెప్పాలని కోరుతూ.. ప్రధాని ఇంటి ఎదుట దీక్షచేస్తే సంజయ్తో కలిసి ఆ దీక్షలో పాల్గొంటామని స్పష్టం చేశారు. నిజంగా బీసీ బిడ్డగా ఆ వర్గానికి చెందిన సమస్యలపై చిత్తశుద్ధి ఉంటే.. ప్రధాని ఇంటి ఎదుట దీక్ష చేసే దమ్ముందా చెప్పాలంటూ ప్రశ్నించారు. ఇవే కాదు.. పెంచిన పెట్రోల్, గ్యాస్ ధరలపై ఒక్క మాటైనా ఎందుకు మాట్లాడడం లేదని ప్ర శ్నించారు. ధరణి పోర్టల్ సమస్యల గురించి మాట్లాడే నైతిక హక్కు బండికి లేదన్నారు. దశాబ్ధాల తరబడి ఉన్న రెవెన్యూ సమస్యలకు పరిష్కారం చూపి.. రైతుల ఇబ్బందులను దూరం చేసేందుకు తెచ్చిన ధరణి ద్వారా 99 శాతం భూ సమస్యలు పరిష్కారమయ్యాయని పేర్కొన్నా రు. ఒకటి రెండు సమస్యలు ఉంటే.. రెవెన్యూ సదస్సుల్లో పరిష్కరిస్తామన్నారు. ప్రతి అంశం లోనూ విఫలమవుతున్న కేంద్రం.. చివరకు రా ష్ట్రంలో రైతులు పండించిన ధాన్యం కొనుగోలు విషయంలోనూ విషం చిమ్ముతున్నదని, నిజం గా రైతులపై ప్రేమ ఉంటే వానకాలం బియ్యం కొంటరా? కొనరా చెప్పాలని డిమాండ్ చేశారు.
నాలుగు పైసలు తెచ్చావా?: ఎమ్మెల్యే రసమయి బాలకిషన్
ఎన్నో ఆశలతో ప్రజలు గెలిపిస్తే.. ఎంపీగా ఏనాడైనా నియోజకవర్గానికి నాలుగు పైసలు తెచ్చావా? ముందుగా బండి సంజయ్ ప్రజలకు చెప్పాలని రసమయి బాలకిషన్ డిమాండ్ చేశారు. ఎంపీగా నీ నిధులు ఏం చేస్తున్నావో.. ఎక్కడ ఖర్చు చేస్తున్నావో చెప్పాలని ప్రశ్నించారు. గతంలో ఎంపీగా పని చేసిన వినోద్కుమార్.. నియోజకవర్గానికి రూ.2 కోట్ల మేరకు నిధులు ఇచ్చారని, గెలిచి మూడేళ్లు అవుతున్నా.. బండి ఏనాడైనా ఒక్క పైసా నియోజకవర్గాల అభివృద్ధికి ఇచ్చావా చెప్పాలన్నారు. ఇక్కడ మౌన దీక్ష చేయడం.. ఢిల్లీకి వెళ్లి అక్కరకురాని లొల్లి పెట్టడం తప్ప.. అభివృద్ధిపై నీకు చిత్త శుద్ధి ఎక్కడుందో చెప్పాలన్నారు. నిజానికి ఒక పదవిలో ఉన్న అత్యున్నత నాయకుడు వచ్చినప్పుడు.. మన ప్రాంత సమస్యలు చెప్పి.. సదరు నేత నుంచి అభివృద్ధి కోసం డబ్బులు తెచ్చుకోవడం నాయకుడి పని అని సూచించారు. ఉదాహరణకు ముఖ్యమంత్రి నియోజవర్గాలకు వస్తే వారికి నియోజకవర్గంలోని సమస్యలను వివరించి. కొన్ని హామీలు ఇప్పించుకుంటామన్నారు. ప్రధాని వచ్చి రెండు రోజులు రాష్ట్రంలోనే ఉన్నా.. ఆ పని నీవెందుకు చేయలేకపోయావో? చెప్పాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గ సమస్యలపై వినతిపత్రం ఇచ్చి… కొన్ని హామీలు తీసుకొని ఉంటే సంతోషించే వారమన్నారు. “మోదీ నా దేవుడు అంటూ ప్రసంగాలు చేశావు కదా..? అదే దేవుడు నీ నియోజకవర్గానికి ఒక్కటంటే ఒక్క పని ఏమి చేశాడో ప్రజలకు చెప్పగలవా?” అంటూ ప్రశ్నించారు. ఈర్ష్య, ద్వేషం చూపకుండా… కలిసి రావాలని సూచించారు.
డ్రామా దీక్షలు
– ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసింది మౌన దీక్ష కాదని, అదో డ్రామా దీక్ష అని సుంకె రవిశంకర్ విమర్శించారు. గతం లో ఎంపీ, దుబ్బాక ఎన్నికల సమయంలో ఈ తరహా డ్రామా దీక్షలు చేశారని, ఇలాంటి దీక్షలు చేసి ప్రజలను పక్కదారి పట్టించడం సంజయ్కు వెన్నతో పెట్టిన విద్య అని మండిపడ్డారు. కరీంనగర్కు ఎంపీగా చేస్తే.. ఈ ని యోజకవర్గ అభివృద్ధికి ఏమి తెచ్చావో చెప్పమని ఇప్పటికే పలుసార్లు ప్రశ్నించినా సమాధానం చెప్పలేదన్నారు. అదేకాకుండా.. ఇ ప్పుడు దక్షిణ తెలంగాణ ఎడారిగా మారిందంటూ ఒక కొత్త డ్రామాకు తెరలేపారని వి మర్శించారు. పాలమూరు, రంగారెడ్డి నుంచి మొదలుకుంటే.. ప్రతి జిల్లాలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించడానికి సీఎం చేస్తున్న కృషి, పారుతున్న నీళ్లు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. టీఆర్ఎస్లో ఏక్నాథ్ షిండేలున్నారంటూ సంజయ్ చెపుతున్నారని, అలాంటి వాళ్లు టీఆర్ఎస్లో ఉండరని స్పష్టం చేశారు. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులను కట్టి.. అన్నదాతల కన్నీళ్లను ప్రజల కష్టాలను తీర్చేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తుంటే.. కుటిల యంత్రాలు చేస్తూ ప్రభుత్వాలను మీ పార్టీ కూల్చుతుందని తెలిపారు. మతంపేరుతో బీజేపీ విషాన్ని చిమ్ముతుంటే.. అభివృద్ధి పేరుతో రాష్ర్టాన్ని అగ్రగామిలో నిలిపిన ఘనత సీఎం కేసీఆర్కు దక్కుతుందన్నా రు. బ్లాక్మెయిల్ రాజకీయాలు చేయడం బీ జేపీకి ఆనవాయితీ అయితే.. స్వచ్ఛమైన పాలన అందించడం టీఆర్ఎస్ లక్ష్యమన్నా రు. రాష్ట్రంలో అమలవుతున్న ఏ ఒక్క పథకమైనా బీజేపీ అధికారంలో ఉన్న 18 రాష్ర్టా ల్లో అమలువుతున్నాయా? సూటిగా చెప్పాలని ప్రశ్నించారు. డ్రామా దీక్షలు ఆపి నియోజకవర్గానికి ఏం చేస్తావో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనినాస్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, మేయర్ సునీల్రావు, గ్రంథాలయ చైర్మన్ ఏనుగు రవీందర్రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు.