కరీంనగర్ రూరల్ మండలం చెర్లభూత్కూర్లో చిరుతల రామాయణం ప్రదర్శనలో అపశ్రుతి చోటుచేసుకున్నది. ఆదివారం మధ్యాహ్నం ఒకేసారి పెద్దసంఖ్యలో నాయకులు, ప్రజలు వేదికపైకి రావడంతో ఒక్కసారిగా కుప్పకూలింది. కళాకారులను అభినందించేందుకు వచ్చిన మంత్రి గంగుల స్వల్పగాయాలతో బయటపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..చెర్లభూత్కూర్లో చిరుతల రామాయణ ప్రదర్శనలో భాగంగా ఆదివారం శ్రీరాముడి పట్టాభిషేక ఘట్టాన్ని నిర్వహిస్తున్నారు.
ఇదే సమయంలో మంత్రి గంగుల కమలాకర్, స్థానిక నాయకులు కళాకారులను అభినందించేందుకు వేదికపైకి చేరుకున్నారు. ఈ క్రమంలో భారం అధికమై వేదిక కుప్పకూలింది. మంత్రి కిందకు తూలిపడ్డారు. అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది వెంటనే ఆయనను పైకి లేపారు. ఈ ప్రమాదంలో మంత్రి కాలు, చెయ్యికి స్వల్ఫ గాయాలయ్యాయి. పెను ప్రమాదం తప్పడంతో పార్టీ నాయకులు ఊపిరిపీల్చుకున్నారు. కాగా, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమార్ మంత్రి గంగులను పరామర్శించారు. ప్రమాద వివరాలను అడిగితెలుసుకున్నారు.