గణపతి నవరాత్రోత్సవాలు కనులపండువగా ప్రారంభమయ్యాయి.. అందంగా ముస్తాబైన మండపాల్లో కొలువుదీరిన బొజ్జగణపయ్య ప్రతిమలు సోమవారం తొలిపూజలందుకున్నాయి.. రెండో రోజు కూడా భక్తులు బారులు దీరడంతో ఎక్కడ చూసినా సందడి కనిపించింది. పలుచోట్ల ప్రతిష్ఠించిన వెరైటీ వినాయకులు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. కాగా, కరీంనగర్లోని గంజ్లో ఏర్పాటు చేసిన విగ్రహం వద్ద రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ ప్రత్యేక పూజలు చేశారు.
– కమాన్చౌరస్తా, సెప్టెంబర్ 19
తొమ్మిది రోజుల పాటు భక్తుల పూజలందుకోనున్న వినాయకుడు సోమవారం విభిన్న రూపాల్లో కొలువుదీరాడు. అందంగా ముస్తాబు చేసిన మండపాల్లో తొలిరోజు ఘనమైన పూజలందుకున్నాడు. ఈసారి కూడా ఎక్కువగా మట్టి విగ్రహాలను ప్రతిష్ఠించగా, అందులోనూ విభిన్నంగా దర్శనమిచ్చాడు. ఓ చోట రైతుగా.. గీత కార్మికునిగా.. బుల్లెట్ బైక్పై.. ఇలా వివిధ రూపాల్లో కనిపించి కనువిందు చేశాడు.
– నమస్తే నెట్వర్క్, సెప్టెంబర్ 19