కరీంనగర్, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ‘బండి సంజయ్.. నీవు నీతి, ధర్మం పాటించే వ్యక్తివే అయితే ఈ ఎన్నికల్లో మందు, డబ్బులు పంచలేదని నీవు న మ్మే భాగ్యలక్ష్మీ దేవాలయంలో ప్రమా ణం చేస్తావా..? ఇద్దరం తడి బట్టలతో ఇద్దరం వెళ్దాం.. వచ్చే దమ్మున్నదా..?’ అంటూ సంజయ్కు కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ సవా ల్ విసిరారు. కరీంనగర్ ఎన్నికల్లో ఓట మి తప్పదని తెలుసుకొని సంజయ్ అసహనానికి లోనవుతున్నారని, ఎలాగైనా గెలిచేందుకు అడ్డదారులు తొక్కుతున్నారని విమర్శించారు. మంగళవారం రాత్రి కొత్తపల్లి ము న్సిపల్ పరిధిలో బండి సంజయ్ డబ్బులు పంచడానికి వెళ్లిన సీసీ ఫుటేజీలను బుధవారం కరీంనగర్లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి బయటపెట్టారు.
బండి సంజయ్ తీరుపై ధ్వ జమెత్తారు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం మంగళవారం సాయత్రం ఐదు గంటలకే ప్రచారం ముగిసిందని, అంతటా 144 సెక్షన్ అమల్లో ఉన్నదని వివరించారు. అయినా సంజయ్ ఈ నిబంధనలను కాదని, కొంత మందిని వేసుకొని రెండు కా ర్లలో మంగళవారం రాత్రి తొమ్మిది గంటలకు కొత్తపల్లి మున్సిపల్ పరిధిలోని మడిగిలవాడకు వెళ్లారని తెలిపారు. మూడు సంచుల నిండా డబ్బులు తీసుకెళ్లి పంచారని ఆరోపించారు. ఈ విషయం తెలుసుకొని బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నిస్తే.. వారిపైనే దాడి చేయడంతోపాటు బీఆర్ఎస్ వారే డబ్బులు పంచుతున్నట్లుగా సీన్ సృష్టించే ప్రయత్నం చేశారని మం డిపడ్డారు.
తమ వాళ్లే డబ్బులు పంచినట్లు ఆయనకు సమాచారం వస్తే.. ఎన్నికల కమిషన్కు లేదా పోలీసులకు ఎందుకు ముందుగా ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించారు. వాస్తవాలను కప్పిపుచ్చేందుకే సంజయ్, ఆయన అనుచరులు ఈ కుట్రకు పాల్పడ్డారని ఆగ్రహించారు. సంజయ్ రాత్రి తొమ్మిది గంటల సమయంలో రెండు వాహనాల్లో మనుషులను, డబ్బులను తీసుకెళ్లారంటూ సీసీ ఫుటేజ్ను విలేకరులకు చూపించారు. ఇంతకన్నా సాక్ష్యం ఇంకా ఏమి కావాలని ప్రశ్నించారు. అడ్డదారుల్లో వెళ్లిందే గాక, ఇష్టానుసారం బీఆర్ఎస్ నాయకులను బూతులు తిట్టారని, ఎమ్మెల్యేగా గెలువక ముందే ఇంత గుండాయిజమా..? అని మండిపడ్డారు. ప్రజలంతా ఒకసారి ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు.
బండి ఓటమి ఖాయం
బండి సంజయ్ను ఓడించేందుకు ప్రజలు ఈ సారి కూడా సిద్ధమయ్యారని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ మెజార్టీ సాధించి.. కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమని స్పష్టం చేశారు. కరీంనగర్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా తనను అఖండ మెజార్టీతో గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. నాలుగున్నరేండ్లుగా ప్రజలకు సంజయ్ అందుబాటులో లే రని, అలాగే ఎంపీగా కరీంనగర్ నియోజకవర్గ అభివృద్ధికి ఆయన చేసిదేమీ ఏమీలేదని విమర్శించారు.
ఓటడిగే హక్కు లేదు
ఎంత సేపూ విద్వేషాలు రెచ్చగొట్టడం తప్ప సంజయ్ ఏనాడూ అభివృద్ధిపై దృష్టిసారించలేదని మంత్రి మండిపడ్డారు. కలియుగ దైవం వేంకటేశ్వర స్వామి దేవస్థానం, అలాగే ఇస్కాన్ టెంపుల్ నిర్మాణంలోనూ.. సంజయ్ది గానీ, కేంద్రానిది గానీ భా గస్వామ్యం ఏమీ లేదని స్పష్టం చేశారు. 850 కో ట్లతో చేపట్టే మానేరు రివర్ఫ్రంట్ విషయంలోనూ ఒక్క పైసా కేంద్రం నుంచి ఇప్పించడం లేదన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే బండి సంజయ్కు కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటు అడిగే హక్కులేదన్నారు. కరీంనగర్కు న్యాయ బద్ధంగా రావాల్సిన నవోదయ పాఠశాలలు, ట్రిపుల్ఐటీ తేవడంలో విఫలమయ్యారని, అలాగే, ఒక్క మెడికల్ కళాశాల ఇప్పించలేక పోయారని విమర్శించారు. ఇవేకాదు, ఏనాడూ నగర ప్రజలకు ఆయన అందుబాబులో లేరని, ఎన్నికలు వచ్చినప్పుడే వచ్చి మాయ మాటలు చెప్పడం.. గెలుపు కోసం ఏదో ఒక సంఘటన క్రియేట్చేసి సెంటిమెంట్తో ఓట్లు వేయించుకోవాలనుకోవడం, తద్వారా లబ్ధిపొందాలని సంజయ్ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.
ఆలోచించి ఓటువేయాలి
నగర భవిష్యత్ ప్రజల చేతుల్లో ఉన్నదని, అందుకే ఆలోచించి ఓటువేయాని మంత్రి ప్రజలకు విజప్తి చేశారు. ఈ నియోజకవర్గ అభివృద్ధి నిర్విరామంగా కొనసాగాలన్నా.. కండ్ల ముందే నడుస్తున్న మానేరు రివర్ఫ్రంట్ పనులు పూర్తికావాలన్నా.. నగరం ప్రశాంతంగా ఉండాలన్నా.. ఇంకా అనేక ఇతర అభివృద్ధి పనులు పూర్తికావాలన్నా.. కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు. ఓటు వజ్రాయుధం అని, దానిని వినియోగించే విధానాన్ని బ ట్టి ఆ నియోజకవర్గ భవిష్యత్ ఉంటుందన్నారు. ర హదారులను బాగుచేసుకున్నామని, ఇంకా కొన్ని శి వారు ప్రాంతాల్లో పూర్తిచేయాల్సి ఉందన్నారు. 24 గంటల పాటు మంచినీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటున్న విషయం ప్రజలకు తెలుసని పేర్కొన్నారు. కౌన్సిలర్గా, కార్పొరేటర్గా, ఎ మ్మెల్యేగా తనకు అవకాశం ఇచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈసారి తనను దీవించి, నగరంలో నిరంతర అభివృద్ధిని చేసే అవకాశం కల్పించాలని కోరారు. నియోజకవర్గంతోపాటు కరీంనగర్ను రా ష్ట్రంలో రెండో నగరంగా తీర్చిదిద్దే అవకాశం కల్పించాలని కోరారు. సమావేశంలో నగరమేయర్ సునీల్రావు, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రాజు, బీఆర్ఎస్ నాయకులు జమీలుద్దీన్, హరిశంకర్ పాల్గొన్నారు.