హాంగ్జౌ : ఆసియా గేమ్స్కు ముందు చైనాలో జరుగుతున్న ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్కప్లో హైదరాబాదీ యువ షూటర్ ఇషా సింగ్ మరోసారి స్వర్ణ కాంతులు పంచింది. మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో ఆమె గురితప్పని షూట్తో గోల్డ్ కొల్లగొట్టింది. ఒలింపిక్ మెడలిస్ట్ మను భాకర్ కాంస్యంతో మెరవడంతో భారత్కు డబుల్ పోడియం దక్కింది.
8 మంది తలపడ్డ ఫైనల్లో ఇషా.. 50 పాయింట్లకు గాను 40 స్కోరు చేసి గోల్డ్ దక్కించుకోగా చైనా షూటర్ యూ ఝాంగ్ 37 పాయింట్లతో రజతం గెలుచుకుంది. 28 పాయింటతో మను కాంస్యం సాధించింది. ఈ ఏడాది మనుకు ఇదే తొలి పతకం కాగా హైదరాబాదీ షూటర్కు మునిచ్ (జర్మనీ) వరల్డ్కప్ తర్వాత వరుసగా రెండో పసిడి కావడం విశేషం. ఇషా, భాకర్ పతకాలతో ఈ టోర్నీలో భారత్ మెడల్స్ సంఖ్య మూడుకు చేరింది.