కరీంనగర్ రూరల్, జూన్ 6: రైతు బాగుంటేనే మన దేశం బాగుంటుందని, సీఎం కేసీఆర్ నాయకత్వంలో రైతన్నను కాపాడుకుంటామ ని, ఎల్లవేళలా అండగా ఉంటామని రైతులకు మంత్రి గంగుల కమలాకర్ భరోసా ఇచ్చారు. శనివారం దుర్శేడ్లోని రైతు వేదికలో నిర్వహించిన రైతు దినోత్సవానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా రైతులు, గ్రామస్తులు, నాయకులు మంత్రికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి ఎడ్ల బండిపై సవారి చేస్తూ, ఒగ్గుడోలు కళాకారుల నృత్యాల మధ్య ర్యాలీగా వచ్చి జాతీయ గీతాలాపన చేసి, రైతు దినోత్సవాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడా రు. రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని, రైతు లేకపోతే వ్య వసాయ లేదని, తాను కూ డా రైతు బిడ్డనే అని చెప్పారు. దేశాన్ని కాపాడేది జవాన్ అయితే, మనకు తిండిపెట్టి బతికించేది కిసాన్ అని, అందుకే జై జవాన్.. జై కిసాన్ నినాదం వచ్చిందని తెలిపారు. ఒకప్పుడు సా గు నీరు లేక మన వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయిందని, పక్కన గోదావరి పారినా మన పొలాల్లోకి చుక్క సాగు నీరు రాక, కరెంట్ లేక రైతులు ఏండ్లపాటు ఇబ్బందులుపడ్డారన్నారు.
ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్ పోరాడి తెలంగాణను సాధించారని, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి రాష్ర్టాన్ని సస్యశ్యామలం చేశారని చెప్పారు. సాగు విస్తీర్ణం పెరిగి, భూమికి బరువయ్యే పం టలు పండుతున్నాయని చెప్పారు. ఎన్నికలు వస్తున్నాయని కాంగ్రెస్, బీజేపీలు మళ్లీ గ్రా మాల మీద పడ్డాయని, అసత్య ప్రచారాలతో ప్రజల మధ్య తిరుగుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ రిమోట్ తెలంగాణ ప్రజల చేతుల్లో ఉం టే.. కాంగ్రెస్, బీజేపీల రిమోట్ మాత్రం ఢిల్లీలో ఉందని దుయ్యబట్టారు. వారి పాలిత రాష్ర్టాల్లో స్కామ్లు తప్ప, సంక్షేమ పథకాలు కనిపించవని ఎద్దేవా చేశారు. ఆ పార్టీలకు ఇక్కడ చోటు లేదని, అవకాశం ఇస్తే కాళేశ్వం ప్రాజెక్ట్ను కూలగొడతారనీ, మళ్లీ ఇక్కడి బొగ్గు, నీరు, కరెంటును దోచుకెళ్తారని, తెలంగాణను గుడ్డి దీపం చేస్తారని ఆందోళన వ్యక్తం చేశారు.
తాను తెలంగాణ బిడ్డను అని చెప్పుకుంటున్న షర్మిల తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ ఉందో చెప్పాలని ప్రశ్నించారు. వాళ్ల నాన్నే ఇక్కడి సంపదను కొల్లగొట్టారనీ, షర్మిలను నమ్మే పరిస్థితిలో తెలంగాణ ప్రజలు లేరనీ స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికలు చాలా కీలకమని, మన పిల్లల భవిష్యత్తును నిర్ణయిస్తాయని, ఢిల్లీ పార్టీల మాటలకు మోసపోవద్దన్నారు. మన పిల్లల భవిష్యత్ బాగుండాలంటే.. రాష్ట్ర అభివృద్ధి ప్రదాత సీఎం కేసీఆర్కు బలం చేకుర్చాలని తెలిపారు. అనంతరం రైతులకు భోజనం వడ్డించి, వారితో కలిసి మంత్రి సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా పలువురు రైతులను సన్మానించారు. కార్యక్రమంలో డీఏఓ వాసిరెడ్డి శ్రీధర్, ఆర్డీఓ ఆనంద్కుమార్, సర్పంచ్ గాజుల వెంకటమ్మ, ఉప సర్పంచ్ సుంకిశాల సంపత్రావు ఉన్నారు.