కలెక్టరేట్, మార్చి 14 : హోలీ పండుగ రోజు మానేరు వాగులో పడి మరణించిన ముగ్గురు విద్యార్థుల కుటుంబాలకు మంత్రి గంగుల కమలాకర్ అండగా నిలిచారు. ప్రభుత్వం ప్రకటించిన రూ.3 లక్షలతో పాటు మంత్రి సొంతంగా మరో రూ.2 లక్షలు చెల్లిస్తానని ప్రకటించిన మేరకు మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున రూ.15 లక్షల విలువైన చెక్కులు పంపిణీ చేశారు. చనిపోయిన పిల్లలను తాము తీసుకురాలేమని, తమ వంతుగా ఆర్థిక సాయమందిస్తున్నట్లు చెప్పారు. హోలీ పండుగ రోజు చేతికందివచ్చిన ముగ్గురు పిల్లల మరణం బాధాకరమన్నారు. ఇక్కడ కలెక్టర్ ఆర్వీ కర్ణన్తో పాటు బీఆర్ఎస్ నగర శాఖ అధ్యక్షుడు చల్ల హరిశంకర్ ఉన్నారు.
కార్పొరేషన్, మార్చి 14: పేద, మధ్యతరగతి ప్రజలకు సర్కారు అండగా ఉన్నదని, అనారోగ్యంతో బాధపడుతున్న వారు భయపడవద్దని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ ధీమానిచ్చారు. ఆపత్కాలంలో రాష్ట్ర ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్తో భరోసా కల్పిస్తున్నదని అభయమిచ్చారు. కరీంనగర్లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో 257 మందికి 95.41 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, బీఆర్ఎస్ ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్నదన్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న నిరుపేదలకు రాష్ట్ర ప్రభుత్వం సీఎం సహాయనిధి కింద చికిత్సకు తగిన ఆర్థిక సాయం అందిస్తున్నదన్నారు.
రాష్ట్రంలో ప్రభుత్వ వైద్యరంగానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ దవాఖానలను కార్పొరేట్ హాస్పిటల్స్కు దీటుగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే కరీంనగర్ ప్రభుత్వ దవాఖానలో అధునాతన మిషనరీని అందుబాటులోకి తెచ్చామని, త్వరలోనే ఎమ్మారై సాన్ కూడా అందుబాటులోకి వస్తుందన్నారు. బీఆర్ఎస్ నిరుపేదల ప్రభుత్వమని, వారి సంక్షేమం కోసం ఎన్ని కోైట్లెనా వ్యయం చేసేందుకు సిద్ధంగా ఉందన్నారు. సంక్షేమ పథకాల అమలు కేవలం సీఎం కేసీఆర్తోనే సాధ్యమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ యాదగిరి సునీల్రావు, మారెట్ కమిటీ చైర్మన్ రెడ్డవేణి మధు, కార్పొరేటర్లు కంసాల శ్రీనివాస్, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, నాయకులు సుంకిశాల సంపత్, తిరుపతి నాయక్, పిట్టల రవీందర్ తదితరులు పాల్గొన్నారు.