వెల్గటూర్, ఫిబ్రవరి 23 : సీఎం కేసీఆర్ ఆలోచనతో రూపుదిద్దుకున్న డబుల్ బెడ్రూం ఇండ్లు పేదల ఆత్మ గౌరవానికి ప్రతీకలుగా నిలుస్తున్నాయని మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు. ఎండపల్లి మండలం కొండాపూర్లో కోటి 15 లక్షలతో నిర్మించిన 15 డబుల్ బెడ్రూం ఇండ్లను గురువారం పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేతకానితో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడారు. పేదల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి నిరంతరం పని చేస్తున్నారని, సొంత స్థలం ఉండి అర్హులైన పేదలందరికీ త్వరలో ఆర్థిక సాయం చేయనున్నట్లు చెప్పారు. కాగా, పేదలకు ఇండ్ల పంపిణీతో కొండాపూర్లో పండుగా వాతావరణం నెలకొంది. ముందుగా మహిళలు మంత్రికి బతుకమ్మలతో ఘన స్వాగతం పలికారు.
అంతకు ముందు గ్రామంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 50 మంది మహిళలకు కుట్టు మిషన్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అదే గ్రామానికి చెందిన గుమ్మడి లచ్చయ్య దళితబంధు పథకం ద్వారా నెలకొల్పిన కిరాణ, సారీ సెంటర్ను ప్రారంభించారు. 20 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కునమల్ల లక్ష్మి, జడ్పీటీసీ సుధారాణి, సర్పంచ్ తాటిపర్తి రాజవ్వ, ఎంపీటీసీ జాడి సుజాత-రాజేశం, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ లక్ష్మీనారాయణ, ప్యాక్స్ చైర్మన్ గూడా రాంరెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సింహాచలం జగన్, చల్లూరి రాంచందర్గౌడ్, కృష్ణారెడ్డి, మారం జలేందర్రెడ్డి, పదిరె నారాయణరావు, ఎలుక భగవాన్యాదవ్, ఎండీ రియాజ్, లచ్చయ్య, ఎండీ సలీం, గంగాదర్, మంగ, ఫాతిమా, భాస్కర్, మల్లేశం పాల్గొన్నారు.