రామడుగు, జూన్12: సర్కారు స్కూళ్లలోనే నాణ్యమైన విద్య అందుతుందని ఎంఈ వో అంబటి వేణుకుమార్ తెలిపారు. గోపాల్రావుపేటలో హైస్కూల్ ఉపాధ్యాయులు సోమవారం చేపట్టిన బడిబాటలో ఎంఈవో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్కు దీటుగా సౌకర్యాలు ఉన్నాయన్నారు. నిపుణులైన ఉపాధ్యాయులతో విద్యాబోధన జరుగుతుందన్నారు. విద్యార్థులకు ఉచిత యూనిఫాంలు, పాఠ్యపుస్తకాలు అందిస్తున్నట్టు తెలిపారు. ఈ విద్యా సంవత్సరం నుం చి ‘మన ఊరు మనబడి’లో భాగంగా డిజిటల్ బోధన చేపడుతున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థుల సౌకర్యార్థం తరగతి గదుల్లో డ్యూయల్ డెస్క్లను ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో పాఠశాల ఇన్చార్జి హెచ్ఎం ప్రకాశ్, ఉపాధ్యాయులు బాలచందర్, పీ మంజుల, రజనీ, మంజుల, గంగాధర్, రత్నప్రభ, రాజమౌళి, అస్గర్ అలీ, శ్రీనివాస్, దేవేందర్రెడ్డి, జలపతిరెడ్డి, శ్రీదేవి, చంద్రశేఖర్, పీఈటీలు జ్యోతి, సీఆర్పీ స్రవంతి, పాల్గొన్నారు.
ఉప్పరమల్యాలలో..
గంగాధర, జూన్ 12 : సర్కారు బడుల్లోను విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని ప్రధానోపాధ్యాయుడు నర్సింహరెడ్డి అన్నారు. మండలంలోని ఉప్పరమల్యాల ప్రభుత్వ ఉపాధ్యాయులు సోమవారం గ్రామంలో బడిబాట కా ర్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రా మంలో ఇంటింటికీ వెళ్లి సర్కారు బడిలో ప్రభు త్వం కల్పిస్తున్న మౌళిక వసతులను గురించి వివరించారు. అలాగే సర్కారు బడిలో చదివే విద్యార్థులకు ప్రభుత్వమే ఉచితంగా యూనిఫాంలు, పాఠ్య పుస్తకాలను అందజేస్తుందని, మధ్యాహ్నం విద్యార్థులు పౌష్టికాహారంతో కూడిన మధ్యాహ్న భోజనాన్ని వడ్డిస్తున్నట్లు విద్యార్థులు తల్లిదండ్రులకు పేర్కొన్నారు. పిల్లలను సర్కారు బడిలో చేర్పించాలని కోరారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.