కరీంనగర్ టవర్ సరిల్, ఫిబ్రవరి 21: జిల్లాలోని నిరుద్యోగ యువత కోసం ఈ నెల 24న జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టు జిల్లా ఉపాధి అధికారి వై. తిరుపతి రావు తెలిపారు. ఫ్లిప్ కార్ట్ ఈకార్ట్-కరీంనగర్ సంస్థలో 20 డెలివరీ బాయ్స్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు.
కనీసం పదో తరగతి ఉత్తీర్ణులై, వయస్సు 18 నుంచి 35 ఏండ్ల మధ్య ఉన్న వారు అర్హులని, నెలకు రూ.22,500 నుంచి రూ.30వేల వేతనం, ఉంటుందని, తప్పనిసరిగా బైక్, మొబైల్ ఫోన్ ఉండాలని చెప్పారు. ఆసక్తి ఉన్నవారు ఆధార్ కార్డు, పదో తరగతి మెమో, కుల, నివాస సర్టిఫికెట్లు తీసుకుని హాజరుకావాలని సూచించారు. వివరాలకు 908230384, 7207659969 నంబర్లలో సంప్రదించాలని తెలిపారు. జిల్లాలోని నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.