స్వరాష్ట్రంలో సింగరేణి గని కార్మికుల అభ్యున్నతికి విశేష కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఇదే కోవలో మరో వరం ప్రకటించింది. రామగుండంలో కొత్తగా ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీలో సింగరేణి ఉద్యోగుల పిల్లలకు ఎంబీబీఎస్ సీట్ల కేటాయింపులో రిజర్వేషన్ కల్పించింది. గురువారం తెలంగాణ ప్రభుత్వ కార్యదర్శి ఎస్ఏఎం రిజ్వీ ఉత్తర్వులు జారీచేయగా, సర్కారు నిర్ణయంపై ఆయావర్గాల్లో హర్షం వ్యక్తమవుతున్నది.
ఫర్టిలైజర్సిటీ, జూలై 6: రాష్ట్ర సర్కారు జిల్లాకో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తున్నది. ఇప్పటికే రామగుండంలో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయడమేగాకుండా, గతేడాది నుంచే తరగతులు ప్రారంభించింది. అయితే ఎంబీబీఎస్ సీట్ల భర్తీలో ప్రత్యేక కోటా కేటాయించాలని సింగరేణి ప్రాంత ఉద్యోగులు విజ్ఞప్తి చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే కోరుకంటి చందర్తోపాటు మంత్రులు, ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. వీరి వినతులను పరిగణలోకి తీసుకున్న సీఎం ఉద్యోగుల పిల్లలకు ఎంబీబీఎస్ సీట్ల భర్తీలో రిజర్వేషన్ కల్పించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించా రు. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి గురువారం ఉ త్తర్వులు జారీ చేశారు. కళాశాలలో మొత్తం 150 సీట్లు ఉండగా, 23 సీట్లు ఆల్ ఇండియా రిజర్వేషన్కు కేటాయించారు. మిగిలిన 127 సీట్లలో 5శా తం రిజర్వేషన్ ప్రకారం 7 సీట్లు సింగరేణి ఉద్యోగుల పిల్లలకు కేటాయించనున్నారు. నీట్ మెరిట్ ప్రకారం భర్తీ కానున్న ఈ సీట్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను పరిగణలోకి తీసుకుంటారు. ప్రభు త్వం తీసుకున్న నిర్ణయంపై సింగరేణి ఉద్యోగులు, కార్మికులు సంబురపడుతున్నారు. రామగుండం లో మెడికల్ కాలేజీ ఏర్పాటు, ఇప్పుడు సింగరేణి పిల్లలకు ఎంబీబీఎస్ సీట్లలో 5 శాతం రిజర్వేషన్ విషయంలో ఎమ్మెల్యే చందర్ కృషి ఎనలేనిదని చెబుతున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీకి కట్టుబడి రిజర్వేషన్ కల్పించారని కొనియాడుతున్నారు. సింగరేణి ఫండ్స్తో నిర్మించిన కాలేజీతో కార్మికులకు ఒరిగిందేమిటని విమర్శించిన వారికి ఇది చెంపపెట్టులాంటిదని చెబుతున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, ఎమ్మెల్యే చందర్కు కృతజ్ఞతలు తెలిపారు.
సింగరేణికి గర్వకారణం
ఉమ్మడి రాష్ట్రంలో మెడికల్ కళాశాలలో సీట్లు దొరక్క సింగరేణి కార్మికుల పిల్లలు ఇబ్బంది పడ్డారు. తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్ చొరవతో ఇక్కడ మెడికల్ కళాశాల ఏర్పాటైంది. అంతేగాకుండా కాలేజీలోని 150 సీట్లల్లో ఏడు సీట్లు కార్మికుల పిల్లలకు కేటాయించడం గర్వకారణంగా ఉన్నది. ఎంబీబీఎస్ సీట్లలో ప్రత్యేక కోటా ఇచ్చిన సీఎంకు కేసీఆర్ కృతజ్ఞతలు.
– కైలాసకోటి శ్రీనివాస్, ఓసీపీ 5 ఈపీ ఆపరేటర్
చారిత్రాత్మక నిర్ణయం..
సింగరేణి కార్మికుల పిల్లలకు మెడికల్ కళాశాలలో ఏడు సీట్లు కేటాయిస్తూ సర్కారు చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నది. దీంతో ఈ ప్రాంతంలోని పిల్లలకు వైద్యవిద్య అందుబాటులోకి రానున్నది. ఎందరో డాక్టర్లయ్యే అవకాశం దక్కుతుంది. ఇంత గొప్ప నిర్ణయం తీసుకున్న ప్రభుత్వానికి కార్మికుల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా.
– పుట్ట రమేశ్, సీహెచ్పీ ఆర్జీ-1 ఫిట్టర్
సొంత ఊరిలో వైద్యవిద్య..
సింగరేణి ఉద్యోగుల పిల్లలకు ప్రభుత్వం రిజర్వేషన్ కేటాయించడం హర్షంచదగిన విషయం. దీంతో ఈ ప్రాంతానికి చెందిన ఏడుగురికి యేటా స్థానికంగానే వైద్యవిద్యను అభ్యసించే అవకాశం కలుగుతుంది. అంతేకాదు గని కార్మికులకు వైద్యసేవలందించే సౌలభ్యం ఉంటుంది. ఇది చాలా గొప్ప నిర్ణయం. కార్మిక కుటుంబాలకు ఎంతో దోహదం చేస్తుంది.
– డాక్టర్ శిరీష, అసిస్టెంట్ ప్రొఫెసర్