కరీంనగర్ విద్యానగర్, మే 22: ప్రభుత్వ జనరల్ దవాఖాన, కరీంనగర్లోని కార్యాలయంలో 100 చెల్లించి సంబంధిత వైద్యుల నుంచి ఉద్యోగులు మెడికల్ సర్టిఫికెట్లు తీసుకోవాలని జీజీహెచ్ సూపరింటెండెంట్ గుండా వీరారెడ్డి సూచించారు. సర్టిఫికెట్ల కోసం వచ్చే పేదల నుంచి కొంతమంది సిబ్బంది అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. సర్టిఫికెట్ల కోసం ఎవరినీ ఆశ్రయించకుండా నేరుగా జీజీహెచ్ కరీంనగర్కే రావాలని సూచించారు. కొంతమంది జిరాక్స్ సెంటర్లతో కుమ్మక్కు అవుతున్నారని తెలియడంతో ప్రత్యేక కౌంటర్ను ఏర్పాటు చేశామన్నారు. కేవలం జీజీహెచ్, కరీంనగర్ ఉన్న స్టాంప్ మెడికల్ సర్టిఫికెట్లు చెల్లుబాటు అయ్యేవిధంగా ఉన్నతాధికారులకు సిఫారసు చేస్తామన్నారు. కొంతమంది సిబ్బంది దగ్గర ఇప్పటికే పెద్ద మొత్తంలో గ్రీన్ పెన్నులతో స్టాంపులను స్వాధీనం చేసుకున్నామని, ఇప్పటికైనా వారు పద్ధతి మార్చుకోకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.