Medical camps | |చిగురుమామిడి, ఫిబ్రవరి 20 : ప్రభుత్వ దవాఖానాలలో ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక ఉచిత వైద్య శిబిరాలను గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాలని అడిషనల్ డీఎంహెచ్వో రాజగోపాల్ రావు అన్నారు. చిగురుమామిడి మండలంలోని రేకొండ ఆరోగ్య ఉప కేంద్రంలో ఉచిత వైద్య శిబిరాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ శిబిరానికి హాజరై ఆయన మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
వైద్య శిబిరాలలో జనరల్ మెడికల్ చెక్ అప్, స్త్రీల సమస్యలు, చిన్న పిల్లల సమస్యలు, చెవి, ముక్కు, గొంతు, ఆర్థోపెటిక్, కంటి, దంత వైద్య నిపుణులు వైద్య శిబిరానికి వచ్చినట్లు పేర్కొన్నారు. ఈ వైద్య శిబిరంలో రక్త, మూత్ర పరీక్షలతో పాటు గుండెకు సంబంధించిన ఈసీజీ పరీక్షలను ఉచితంగా ఏర్పాటు చేశామన్నారు. గ్రామంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరానికి విశేష స్పందన లభించిందని చెప్పారు.
గ్రామంలో 308 మంది వైద్య పరీక్షలు చేయించుకున్నారన్నారు. ప్రభుత్వం అందించే వైద్య సదుపాయాలను, ఉచిత మందులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా చేపట్టిన ఉచిత వైద్య శిబిరాలకు విశేష స్పందన లభిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి సందీప్ రెడ్డి, బస్తీ దవాఖాన వైద్యాధికారిని విశాల, సర్పంచ్ అల్లెపు సంపత్, పంచాయతీ కార్యదర్శి అజయ్ కుమార్, సూపర్వైజర్ హేమలత, ఏఎన్ఎంలు ధనలక్ష్మి, స్వరూప, శైలజ, పద్మ, ఆశాలు బండారి సరోజన, దుడ్డెల తిరుమల, పూజ, ప్రియాంక, సుగుణ, సుజాత, లింగవ్వ, సంధ్య, సిబ్బంది పాల్గొన్నారు.