విద్యానగర్, డిసెంబర్ 18: సేవా దృక్పథంతో నిర్వహించే ఉచిత వైద్య శిబిరాలను ప్రతి ఒకరూ సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ కోరారు. నగరంలోని ఖాన్పురలో సిటిజన్ దవాఖాన సౌజన్యంతో అబూబాకర్ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అండ్ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఉత్తమ వైద్య సేవలందించిన పలువురికి మెమోంటోలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ, సిటిజన్ దవాఖాన ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. వైద్య శిబిరంలో సుమారు 200 మందికి వివిధ పరీక్షలు చేసి, ఉచితంగా మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బండారి కుమార్, డాక్టర్ నవనీత్ కుమార్, డాక్టర్ షాహిద్, డాక్టర్ శ్రవణ్, డాక్టర్ మౌనిక, డాక్టర్ సోబియా ఖలీం, నిర్వాహకులు అబూబాకర్ సిద్ధిఖి, మెండి చంద్రశేఖర్ పాల్గొన్నారు.
కార్పొరేషన్, డిసెంబర్ 18: మున్నూరు కాపు ఉద్యోగులంతా ఐక్యంగా ఉండాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. మున్నూరు కాపు ఉద్యోగుల, విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు వీర బుచ్చయ్య ఆధ్వర్యంలో కార్యవర్గం మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రతి ఒకరూ ఏదో ఒక విధంగా సంఘటితంగా ఉండాలన్నారు. మున్నూరు కాపు కులస్తులు సమాజంలో వివిధ రంగాల్లో ఉద్యోగులుగా రాణిస్తూ సమాజాభివృద్ధికి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. అందరూ ఐక్యంగా ఉండడం ద్వారా ఒకరికొకరు సహకరించుకోగలుగుతామని, పదిమందికి ఉపయోగపడుతామన్నారు. సమాజంలోని అన్ని వర్గాల వారికి సహకారం అందించేలా పని చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు మామిడి రమేశ్, జిల్లా ప్రధాన కార్యదర్శి కామ సతీశ్, కోశాధికారి బట్టు కరుణాకర్, సహాధ్యక్షులు గాదె నాగులు, శ్రీనివాస్, నాయకులు నంది శ్రీనివాస్, పత్తెం వసంత, సుధాకర్, పత్తెం మధు, దేవరాజు, కిషన్, తదితరులు పాల్గొన్నారు.