హుజూరాబాద్ టౌన్, ఫిబ్రవరి 18: మేడారం సమ్మక జాతరకు హుజూరాబాద్ నుంచి ఆర్టీసీ బస్సులను ఆదివారం స్థానిక బస్టాండ్లో డిపో మేనేజర్ శ్రీకాంత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేటి నుంచి ఈ నెల 25 వరకు నిత్యం 120 బస్సులు హుజూరాబాద్ మీదుగా మేడారానికి నడుపుతున్నట్లు తెలిపారు.
భక్తులు ఆర్టీసీ సేవలను వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఎస్టీఐ మురళి, ఏఎంఎఫ్ సమ్మయ్య, బస్టాండ్ మేనేజర్ వీవీఆర్ రెడ్డి, సిబ్బంది సురేఖ, ఎస్ఎస్ రాణి, జాఫర్, టీఎస్ సింగ్, ఆర్టీసీ హెడ్ కానిస్టేబుల్ వెంకటరాజం పాల్గొన్నారు.