కమాన్చౌరస్తా/శంకరపట్నం/కరీంనగర్ రూరల్/తిమ్మాపూర్, వీణవంక/సైదాపూర్/ ఇల్లందకుంట/ హుజూరా బాద్ టౌన్/ మానకొండూర్ రూరల్ / చొప్పదండి, ఫిబ్రవరి 22: వనదేవతల జాతరలో భాగంగా గురువారం కోయ పూజారులు సమ్మక్కను తీసుకొచ్చి గద్దెపై ప్రతిష్ఠించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవార్లను దర్శించుకొని, మొక్కులు చెల్లించుకున్నారు. కాగా, రేకుర్తిలో సాయంత్రం 6 గంటల ప్రాంతంలో కార్పొరేటర్లు సుధగోని మాధవీకృష్ణా గౌడ్, రాజశేఖర్, జాతర కమిటీ చైర్మన్ పిట్టల శ్రీనివాస్, ఈవో మారుతి ఆధ్వర్యంలో కోయపూజారులు డప్పు చప్పుళ్లతో గుట్టపై ఉన్న సమ్మక్కను తీసుకువచ్చారు. ఈ క్రమంలో భక్తులు ఎదుర్కోళ్లు, పొర్లు దండాలు సమర్పించారు. ఉదయం సారలమ్మను రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, నాయకులు శ్రీనివాస్, నరేందర్ రెడ్డి, అంజన్కుమార్ దర్శించుకొని, మొక్కులు చెల్లించుకున్నారు.
మంత్రి పొన్నం మాట్లాడూతూ, జాతరలో భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. సమ్మక్క-సారలమ్మల దీవెనలతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. కాగా, సాయంత్రం సమ్మక్కను గద్దెకు తీసుకువస్తున్న సమయంలో మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి పురమళ్ల శ్రీనివాస్, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, తదితరులు హాజరై అమ్మవార్లకు మొక్కులు చెల్లించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ వినోద్కుమార్ మాట్లాడుతూ, సమ్మక్క-సారలమ్మ ఆశీర్వాదంతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, పల్లెలు పచ్చగా ఉండి, పంటలు బాగా పండాలని ఆకాంక్షించారు. రాత్రి వరకు సుమారు లక్ష మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. రేకుర్తిలో సమ్మక్క జాతర వద్ద పోలీసులు, సాన్వి, తేజస్, ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ వలంటీర్లు బందోబస్తు నిర్వహించారు. సమ్మక్క గద్దె వద్దకు వస్తున్న క్రమంలో సీఐ, ఎస్ఐ ఆధ్వర్యంలో రోప్ బృందం ముందు రాగా, కోయ పూజారులు అమ్మవారిని తీసుకువచ్చా రు. స్థానిక వావిలాలపల్లిలోని అల్ఫోర్స్ సూల్ ఆఫ్ జెన్ నెక్ట్ మైదానంలో విద్యాసంస్థల ఆధ్యర్యంలో సమ్మక-సారలమ్మ జాతర ఘనంగా నిర్వహించినట్లు విద్యాసంస్థల అధినేత డాక్టర్ వీ నరేందర్ రెడ్డి పేర్కొన్నారు.
వేడుకల్లో ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. చింతకుంటలో గద్దెల వద్ద ఈవో అనిల్, ఎంపీటీసీ తిరుపతి నాయక్, మాజీ సర్పంచ్ సమ్మయ్య, నిర్వాహకుడు తిరుపతి భక్తులకు ఏర్పాట్లు చేశారు. శంకరపట్నం మండలం కేశవపట్నం, గద్దపాక, ఆముదాలపల్లి గ్రామాల్లో మేడారం కోయ పూజారుల ఆధ్వర్యంలో స్థానిక పూజారులు గొడిశాల ఎల్లయ్య, జనగాం తిరుపతి, కొత్తపెల్లి రాజయ్య, జాతర కమిటీ సభ్యులు సమ్మక్కను తీసుకొచ్చి గద్దెపై ప్రతిష్ఠించారు. భక్తులు అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. కేశవపట్నంలో సంజీవని చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తాగునీటి సౌకర్యం కల్పించారు.
కరీంనగర్ రూరల్ మండలం నగునూర్, ఇరుకుల్ల, హౌసింగ్బోర్డు కాలనీలో భక్తులు అమ్మవార్లను దర్శించుకొని, మొక్కులు చెల్లించుకున్నారు. తిమ్మాపూర్ మండలం రామకృష్ణకాలనీ, నల్లగొండ, కొత్తపల్లి, వచ్చునూరు గ్రామాల్లో భక్తులకు అధికారులు, జాతర కమిటీ నిర్వాహకులు సౌకర్యాలు ఏర్పాటు చేశారు. వీణవంక మండల కేంద్రంతోపాటు చల్లూరు, పోతిరెడ్డిపల్లి, కోర్కళ్ గ్రామాల్లో కోయ పూజారులు సమ్మక్క తల్లిని వనం నుంచి గద్దెపై ప్రతిష్ఠించారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి, యప్టీవీ సీఈవో పాడి ఉదయ్నందన్ రెడ్డి, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. సైదాపూర్ మండలం వెన్నంపల్లి, జాగీర్పల్లి-సైదాపూర్ గ్రామాల్లో సమ్మక్కసారలమ్మను రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ దర్శించుకొని పూజలు నిర్వహించారు. సైదాపూర్లో మంత్రి ఎత్తు బంగారం ఇచ్చారు.
వెన్నంపల్లిలోని మత్స్యగిరీంద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. హుజూరాబాద్ శివారులోని రంగనాయకులగుట్ట వద్ద గద్దెపైకి కోయ పూజారులు సమ్మక్కను తీసుకొని ప్రతిష్ఠించారు.జాతరలో సేవలందిస్తున్న వలంటీర్లకు ఉత్సవ కమిటీ టీ షర్టులు, విజిల్స్ను టౌన్ సీఐ బొల్లం రమేశ్ చేతుల మీదుగా అందజేశారు. మానకొండూర్ మండలం కొండపల్కల, వేగురుపల్లి గ్రామాల్లో వనదేవతలను ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ దర్శించుకొని మొ క్కులు చెల్లించుకున్నారు. కొండపల్కల గ్రామానికి చెందిన కాం గ్రెస్ నాయకుడు నాగిశెట్టి రాజయ్య డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఎమ్మెల్యేగా గెలుపొందిన సందర్భంగా ఎమ్మెల్యే ఎత్తు బంగారం అమ్మవార్లకు మొక్కులు చెల్లించారు. అలాగే, దేవంపల్లి, లింగాపూర్లో భక్తులు అమ్మవార్లను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. చొప్పదండితోపాటు ఆర్నకొండ, రాగంపేట, గుమ్లాపూర్ గ్రామాల్లో కోయపూజారులు సమ్మక్క ను తీసుకొచ్చి గద్దెపై ప్రతిష్ఠించారు.