త్వరలోనే బస్తీ దవాఖానలతోపాటు పల్లె దవాఖానలు ప్రారంభించుకోబోతున్నామని, ప్రతిచోటా ఎంబీబీఎస్ వైద్యులు వచ్చి సేవలు అందిస్తారని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ తెలిపారు.
సిరిసిల్ల రూరల్, సమావేశంలో మాట్లాడుతున్న రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్
ప్రతిచోటా ఎంబీబీఎస్ వైద్యులు
రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్
సిరిసిల్ల ఐఎంఏ మహిళా విభాగం కార్యవర్గ ప్రమాణ స్వీకారం
సిరిసిల్ల రూరల్, నవంబర్ 26 : త్వరలోనే బస్తీ దవాఖానలతోపాటు పల్లె దవాఖానలు ప్రారంభించుకోబోతున్నామని, ప్రతిచోటా ఎంబీబీఎస్ వైద్యులు వచ్చి సేవలు అందిస్తారని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ తెలిపారు. ఈ మేరకు శనివారం రాత్రి సిరిసిల్ల మున్సిపల్ పరిధి రగుడులోని ఐఎంఏ భవన్లో ఐఎంఏ మహిళా వైద్యుల విభాగం జిల్లా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మహిళా వైద్యుల విభాగం ఏర్పాటు చేసుకోవడంతోపాటు మహిళలపై అఘాయిత్యాలకు వ్యతిరేకంగా తమ వంతుగా కృషి చేస్తామని ముందుకు రావడం అభినందనీయమన్నారు.
వైద్యసేవలందిస్తున్న వారిని డబ్బుకోసమే పనిచేస్తున్నట్లుగా గుర్తించడం సరికాదని అభిప్రాయపడ్డారు. వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చన్నారు. వైద్యులకు ప్రజాప్రతినిధులు, రోగుల బంధువులు ధైర్యం అందిస్తే మెరుగైన వైద్యం అందించి ప్రాణాలను కాపాడుతారని చెప్పారు. సీఎం కేసీఆర్ సర్కారు వైద్యంపై భరోసా కల్పించారని, ప్రతి జిల్లాకు మెడికల్ కళాశాలకు ఏర్పాటు చేసుకుంటున్నామని చెప్పారు. రానున్న రోజుల్లో పేదలకు పైసా ఖర్చు లేకుండా వైద్య అందుతుందన్నారు. వేములవాడ ప్రభుత్వ దవాఖాన కార్పొరేట్ దవాఖానల మాదిరిగా పరిశుభ్రంగా ఉందని చెప్పారు.
ఈ విషయాన్ని రెండు రోజుల క్రితమే సీఎం కేసీఆర్కు చెప్పడంతో సంతోషపడ్డారని గుర్తు చేశారు. అంతకు ముందు ఎమ్మెల్యే రమేశ్బాబు ఐఎంఏ మహిళా వైద్యుల విభాగం కార్యవర్గాన్ని అభినందించారు. అనంతరం కార్యవర్గాన్ని సన్మానించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ చైర్ పర్సన్లు జిందం కళ, మాధవి, ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు బీఎన్ రావు, జాతీయ ఉపాధ్యక్షుడు రవీందర్రెడ్డి, ఐఎంఏ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ పెంచలయ్య, డీఎంహెచ్వో సుమన్మోహన్రావు, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, కౌన్సిలర్ పోచవేణి సత్య, మురళీధర్రావు, చింతోజు భాస్కర్, డాక్టర్ శోభారాణి, మనోహర్, ఐఎంఏ మహిళా విభాగం నూతన అధ్యక్షురాలు డాక్టర్ పద్మలత, కార్యవర్గం, ఐఎంఏ సభ్యులు పాల్గొన్నారు.