కార్పొరేషన్, నవంబర్ 5: అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించాలని వాకర్స్ అసోసియేషన్ల సభ్యులకు నగర మేయర్ యాదగిరి సునీల్రావు విజ్ఞప్తి చేశారు. నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న మంత్రి గంగుల కమలాకర్ను 4వ సారి భారీ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. నగరంలో మౌలిక సదుపాయాల కల్పన, ప్రజల కోసం పని చేస్తున్న ప్రభుత్వాలకు అండగా ఉండాలని కోరారు. నగరంలో ఆదివారం ఓ ప్రైవేటు ఫంక్షన్హాల్లో వాకర్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ 303 ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాకర్స్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడారు. ప్రతి ఒకరూ వాకింగ్ను అలవాటుగా మార్చుకుంటే సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవిస్తారన్నారు.
సీఎం కేసీఆర్ నాయకత్వంలో మంత్రి గంగుల కమలాకర్, ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ సలహాలు, సూచనల ప్రకారం చాలా చోట్ల నగరపాలక సంస్థ ద్వారా నగరంలో చాలా చోట్ల వాకర్స్ కోసం ప్రత్యేక వాకింగ్ ట్రాక్లు ఏర్పాటు చేశామని తెలిపారు. నగరంలో జ్యోతిబాఫూలే గ్రౌండ్లో ప్రత్యేకంగా ఈపీడీఎం ట్రాక్ను ఏర్పాటు చేశామని తెలిపారు.
మల్టీపర్పస్ పారులో కూడా కోటితో 700 మీటర్ల సింథటిక్ ట్రాక్, ఉమెన్స్ డిగ్రీ కాలేజ్, గిద్దెపెరుమాండ్ల ఆలయ గ్రౌండ్, హౌజింగ్ బోర్డు గ్రౌండ్, మానేరు వంతెన సమీపంలో, ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానం, లేక్ పోలీస్స్టేషన్, అంబేదర్ స్టేడియంలో ప్రత్యేక ట్రాక్లు ఏర్పాటు చేసి లైటింగ్ సౌకర్యం కల్పించామన్నారు.
ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని నగరంలో 60 ఓపెన్ జిమ్ల ఏర్పాటుకు ప్రణాళికాలు చేశామన్నారు. ఇప్పటికే దాదాపు 35 ఓపెన్ జిమ్లను ప్రారంభించి అందుబాటులోకి తెచ్చామన్నారు. మరో 25 ఓపెన్ జిమ్లను కూడ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అన్ని వాకింగ్ గ్రౌండ్లల్లో ట్రాక్లు, సాయంత్రం వాకింగ్ చేసేలా చకటి లైటింగ్ సౌకర్యం, కూర్చోవడానికి సీటింగ్ అరేంజ్మెంట్స్ కూడా ఏర్పాటు చేశామన్నారు. ప్రజల సంక్షేమం కోసం పాటుపడే బీఆర్ఎస్ను గెలిపించాలని, కారు గుర్తుకు ఓటేయ్యాలని కోరారు. కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ల బాధ్యులు చెన్నమనేని సుధాకర్రావు, బుర్ర జగదీశ్వర్, రవీందర్, గుడపాటి రమణరెడ్డి పలు అసోసియేషన్ల సభ్యలు పాల్గొన్నారు.