కార్పొరేషన్, అక్టోబర్ 24 : బండి సంజయ్.. ఎంపీగా నియోజకవర్గంలో ఏ అభివృద్ధి చేశావో.. ఎన్ని నిధులు తెచ్చావో.. ప్రజలకు బహిర్గతం చేయాలని కరీంనగర మేయర్ బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఆయనకు ఎంత సేపూ అసత్యాలు, అబద్ధాలు చెప్పడమే తప్ప అభివృద్ధి ఎలా ఉంటుందో తెలియదని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టు విషయంలో అసత్యాలు, అబద్ధాలు చెబుతూ కేసీఆర్, కేటీఆర్పై వాఖ్యలు చేయడం సరికాదని హితవు పలికారు. ఏమీ తెలియకుండా అనవసర విమర్శలు చేస్తే ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. ఉద్యమ నాయకుడు సీఎం కేసీఆర్పై సంస్కారం లేకుండా మాట్లాడితే చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. కరీంనగర్లోని తన కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కరీంనగర్కు బండి సంజయ్ ఎంపీగా ఉండడం దురదృష్టకరమన్నారు. నాలుగున్నరేండ్లుగా నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి, సంక్షేమం అమలు చేయకుండా విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారన్నారు. ఆయన చేసే వ్యాఖ్యలు ప్రజలకు అగౌరవాన్ని తీసుకువస్తున్నాయన్నారు. కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టు విషయంలో అసత్యాలు, అబద్దాలు చెబుతూ కేసీఆర్, కేటీఆర్పై వాఖ్యలు చేయడం సరికాదని హితవు పలికారు.
రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలిపిన వ్యక్తి కేసీఆర్ అని, అభివృద్ధికే బ్రాండ్ అంబాసిడర్ మంత్రి కేటీఆర్ అని కొనియాడారు. అనవసర విమర్శలు చేస్తే ప్రజలు ఊరుకోరని హెచ్చరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి కోటి ఎకరాలకు సాగునీరు అందించిన భగీరథుడు కేసీఆర్ అనేది ముమ్మాటికి నిజమని, నదులకు నడక నేర్పించి కుంటలు, చెరువులు, ప్రాజెక్టులు మత్తడి దూకించిన ఏకైక నాయకుడని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలు బండి సంజయ్ని ఒక జోకర్గానే చూస్తున్నారని ఎద్దేవా చేశారు. ఆయనకు హుందగా వ్యవహరించడం రాదన్నారు. ఎంత సేపూ అసత్యాలు, అబద్ధాలు ప్రజల్లో ప్రచారం చేయడం తప్ప అభివృద్ధి ఎలా ఉంటుందో తెలియదని ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికల్లో ఆయనకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. మంత్రి కేటీఆర్ 2004 నుంచి 2014 వరకు ప్రత్యక్షంగా ఉద్యమంలో పాల్గొని ప్రజల్ని చైతన్యవంతుల్ని చేసి, తండ్రికి తగ్గ తనయుడిగా గుర్తింపు తెచ్చుకున్నారని గుర్తు చేశారు. రాష్ట్ర సాధనలో బండి సంజయ్ ఏం ఉద్యమం చేశారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. నగరాభివృద్ధికి సీఎం కేసీఆర్ 1800 కోట్ల నిధులు ఇచ్చారని, హామీ మేరకు నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేలా సహకరిస్తున్నారని తెలిపారు. ఎన్నికల్లో బీజేపీని బొంద పెట్టడం ఖాయమని, బీఆర్ఎస్ ఘన విజయం సాధించడం ఖాయమని స్పష్టం చేశారు.