రుద్రంగి, నవంబర్ 20: మార్కెట్ కమిటీ సభ్యులు సమన్వయంతో ముందుకు సాగాలని, రైతులను సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు సూచించారు. రుద్రంగి మండల కేంద్రంలోని రెడ్డి ఫంక్షన్హాల్లో ఆదివారం జరిగిన వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎమ్మెల్యే రమేశ్బాబు, జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ ముఖ్య అతిథులుగా హాజరై సభ్యులతో ప్రమాణం స్వీకారం చేయించారు. కమిటీ చైర్మన్గా ఏనుగు శ్రీనివాస్, వైస్ చైర్మన్గా కంటె రెడ్డి, డైరెక్టర్లుగా గుగులోత్ శ్యాంసుందర్, తలారి మణి, ఎండి బాబా, కొండ లక్ష్మణ్, కొమ్ము రమేశ్, సిరికొండ మల్లయ్య, ఎక్కలదేవి మహేందర్, లకావత్ శత్రులాల్, కత్తి శ్రీనివాస్, పరికెల కిష్ణస్వామి, పోతురాజు నాగేశం, నగురం శంకర్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం తాగు, సాగు నీరు, విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు.
మెట్ట ప్రాంతమైన రుద్రంగి, చందుర్తి మండలాలకు కాళేశ్వరం నుంచి ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాలు తెచ్చింది తెలంగాణ ప్రభుత్వమేనన్నారు. ఈ ఏడాది ఎప్పుడూ లేని విధంగా ధాన్యం రెట్టింపు దిగుబడి వచ్చిందన్నారు. గతంలో 60 వేల క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేస్తే స్వరాష్ట్రంలో రైతుల నుంచి 3 లక్షల క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేసిందన్నారు. త్వరలోనే కేటీఆర్ చేతుల మీదుగా కేజీబీవీ పాఠశాల ప్రారంభోత్సవం జరుగుతుందన్నారు. మండలకేంద్రంలో 30 పడకల దవాఖాన, డబుల్ రోడ్డుకు 5కోట్లు నిధులు మంజూరయ్యాయని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర సర్కారు దళిత బంధు, రైతు బంధు, రైతు బీమా వంటి అనేక పథకాలు అమలు చేస్తున్నదన్నారు. సహకార సంఘాల ద్వారానే ఈ ప్రాంతం అభివృద్ధి జరుగుతుందన్నారు. రానున్న సెస్ ఎన్నికల్లో మంచి పాలకవర్గాన్ని ఎన్నుకుందామని రైతులకు పిలుపునిచ్చారు.
అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధుల సమన్వయంతో మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ముందుకుసాగాలన్నారు. అనంతరం మార్కెట్ కమిటీ చైర్మన్ ఏనుగుల శ్రీనివాస్ మాట్లాడుతూ మార్కెట్ కమిటీ పాలకవర్గం నియామకానికి సహకరించిన ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబుకు, స్థానిక నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మార్కెట్ యార్డు పరిధిలో రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. అనంతరం దళిత బంధు కింద లబ్ధిదారు ఏర్పాటు చేసుకున్న హోటల్, మార్కెట్ యార్డులో రూ.42 లక్షలతో నిర్మించిన నూతన భవనాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. 234 మంది గంగపుత్ర మహిళలకు మత్స్య సంఘం సభ్యత్వ కార్డులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్క్ఫెడ్ చైర్మన్ లోక బాపురెడ్డి, వేములవాడ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రభాకర్, ఎంపీపీలు గంగం స్వరూపరాణి, బైరగోని లావణ్య, జడ్పీటీసీలు గట్ల మీనయ్య, నాగం కుమార్, సింగిల్విండో చైర్మన్లు తిప్పని శ్రీనివాస్, జలగం కిషన్రావు, వైస్ ఎంపీపీ పీసరి భూమయ్య, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు మ్యాకల ఎల్లయ్య, దేగావత్ తిరుపతి, సర్పంచ్ తర్రె ప్రభలత, ఎంపీటీసీ మంచె లావణ్య, జమిలా బేగం, చందుర్తి, రుద్రంగి మండలాల టీఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.