కరీంనగర్, అక్టోబర్ 21 : దీపావళి పండుగకు బంతిపూలు సరికొత్త అందాలను తెచ్చి పెడుతాయి. దీపాల వెలుగులు రాత్రి వేళ మెరిస్తే.. ముద్దబంతులతో అలంకరించిన ఇండ్లలో నిజమైన పండుగ వాతావరణం కనిపిస్తుంది. అంతటి అందాలను తెచ్చే బంతిపూల సాగు కోసం మూడు నెలల ముందే ప్రణాళికతో సిద్ధమవుతారు.
పెద్ద సైజులో వచ్చే పూల కోసం ముందే విత్తనాలను సిద్ధం చేసుకుని పండుగ సమయానికి కోతకు వచ్చేలా సాగు చేస్తారు. కొందరు రైతులు ఏటా బంతిపూల సాగుపైనే దృష్టిపెట్టి పండుగలకు విక్రయిస్తుంటారు. తిమ్మాపూర్ మండలకేంద్రంలోని రాజీవ్ రహదారి పక్కన దీపావళి పండుగకు విక్రయించేందుకు బంగారు వర్ణంలో ఉన్న బంతిపూల వనంలో పూలు కోస్తుండగా ‘నమస్తే’ తన కెమెరాలో బంధించింది.