ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 21: ‘కాంగ్రెస్, బీజేపీవి ప్రగల్భాలు.. బీఆర్ఎస్వీ పథకాలు. ప్రతిపక్షాల మాయ మాటలు నమ్మి ఆగంకావద్దు. మేలు చేసిన వారిని మరిచిపోవద్దు’ అని కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్రావు అన్నారు. అడగకముందే వరాలిచ్చే దేవుడు సీఎం కేసీఆర్ అని అభివర్ణించారు. శుక్రవారం ఇబ్రహీంపట్నంలో అమ్మక్కపేట, కోజన్కోత్తూర్, కేశాపూర్, ఇబ్రహీంపట్నం, వర్షకొండ, ఎర్రాపూర్, డబ్బా, కొమటి కొండాపూర్, ఎర్దండి గ్రామాలకు చెందిన 9860 మందికి పింఛన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, అరవై ఏండ్ల కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీలేదని దుయ్యబట్టారు. కానీ బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో అన్ని వర్గాలకు మేలు చేసిందన్నారు.
దేశంలో ఎక్కడాలేనివిధంగా కల్యాణలక్ష్మి, షాదీముబారక్, కేసీఆర్ కిట్లు లాంటి అనేక అద్భుత పథకాలను అమలు చేస్తున్నారని కొనియాడారు. కేంద్రం తెలంగాణకు రాజ్యాంగబద్ధంగా వచ్చే నిధులు తప్పా అదనంగా నయాపైసా ఇవ్వడంలేదని ఆరోపించారు. నియోజకవర్గంలో ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని వాగ్దానాలను సైతం నేరవేర్చానని చెప్పారు. నాపై నమ్మకంతో ఇబ్రహీంపట్నం జడ్పీటీసీగా, నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించారని గుర్తు చేసుకున్నారు. ఇదే విశ్వాసం తో మీ ముందుకు వస్తున్న తన కొడుకు డాక్టర్ సంజయ్ కల్వకుంట్లను సైతం ఆశీర్వదించాలని కోరారు.
సంజయ్ను గెలిపిస్తే మరింత అభివృద్ధి చేసి చూపిస్తామని స్పష్టంచేశారు. అంతకుముందు విద్యాసాగర్రావు, సంజయ్ను ప్రజాప్రతినిధులు గజమాలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమాల్లో ఎంపీపీ జాజాల భీమేశ్వరీ, జడ్పీటీసీ కంటం భారతి, వైస్ ఎంపీపీ లక్ష్మారెడ్డి, సర్పంచుల ఫోరం అధ్యక్షురాలు నేమూరి లత, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు పోన్కంటి వెంకట్, ఎంపీడీవో ప్రభు, తహసీల్దార్ ప్రసాద్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు దశరథ్రెడ్డి, ఆర్బీఎస్ మండల కోఆర్డినేటర్ సుగుణాకర్రావు, నాయకులు జాజాల జగన్రావ్, కంటం రమేశ్, నేమూరి సత్యనారాయణ, ఊటూరి ప్రదీప్కుమార్, చిన్నారెడ్డి, జేడీ సుమన్, రాములు, భూమేశ్, జగన్, రవికాంత్రెడ్డి, సురేశ్రెడ్డి, తుక్కారాం, రాజన్న, గంగాధర్, జీవన్, పవన్, గోపీ,జింక శ్రీనివాస్, రాంరెడ్డి, సుదర్శన్, గణేష్, శ్రీనివాస్, రాజేందర్ ఉన్నారు.
మీ కష్టాల్లో తోడుంటా..
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ రైతాంగం అరిగోస పడ్డది. కరెంట్ రాక, నీళ్లందక, కాలిపోయే మోటర్లతో తీవ్ర ఇబ్బందులు పడ్డది. ఈ పరిస్థితుల్లో రాష్ర్టాన్ని సాధించి అధికారం చేపట్టిన సీఎం కేసీఆర్ 24 గంటల కరెంట్ ఇచ్చి, పుష్కలంగా సాగునీరందించి అన్నదాతకు మేలు చేసిండు. ఇప్పుడిప్పుడే మనందరం బాగుపడుతున్నాం. ఇలాంటి సమయంలో ప్రజలు ప్రతిపక్షాల మాట లు నమ్మి మోసపోవద్దు. అభివృద్దిని చూసి ఓర్వలేకనే ప్రతిపక్షాలు అసత్య ప్రచారాలు చేస్తున్నా యి. కోరుట్ల ప్రజలు మా నాన్నకు ఎమ్మెల్యేగా అవకాశమిచ్చారు. ఆయన అభివృద్ధి చేసి చూపించారు. మీ ముందుకు వస్తున్న నన్ను కూడా ఆదరించండి. మీ ఆత్మీయుడిగా కష్టాల్లో మీకు తోడు గా ఉంటా. ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందిస్తా.
– సంజయ్ కల్వకుంట్ల, కోరుట్ల నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి