ప్రపంచస్థాయి డిజైన్లతో తీర్చిదిద్దుతున్నాం
ఏడాదిన్నరలో పూర్తికి ప్రణాళికలు
కేబుల్ బ్రిడ్జిని కంప్లీట్ చేశాం.. ఆగస్టులో అప్రోచ్రోడ్లు పూర్తి
మంత్రి గంగుల కమలాకర్
రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్తో కలిసి పనుల పరిశీలన
“కరీంనగర్ జిల్లా కేంద్రంలో మానేరు ఫ్రంట్ను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నిర్మిస్తున్నాం. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు గుజరాత్లోని సబర్మతి ప్రాజెక్టు కంటే పది రెట్లు అద్భుతంగా తీర్చిదిద్దుతున్నాం. ఇది దక్షిణ భారత దేశంలోనే మహత్తర ప్రాజెక్టుగా, భవిష్యత్ తరాలకు ఆస్తిగా మారుతుంది. ప్రజలకు ఆహ్లాదం.. ఆనందం కోసం రూ.35 కోట్లతో అద్భుతమైన పౌంటెయిన్ను ఏర్పాటు చేస్తున్నాం. రూ.12 కోట్ల వ్యయంతో దుబాయ్ నుంచి బోట్స్ తెప్పిస్తున్నాం. కేబుల్ బ్రిడ్జి నిర్మాణాన్ని కంప్లీట్ చేశాం. ఆగస్టులో అప్రోచ్ రోడ్డు పనులు పూర్తిచేస్తాం” అని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. ఈ మేరకు సోమవారం రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్తో కలిసి రివర్ ఫ్రంట్ పనులను, కేబుల్బ్రిడ్జిని పరిశీలించారు.
అభివృద్ధే మా లక్ష్యం..
ముఖ్యమంత్రి కేసీఆర్ 2014లో అధికారం చేపట్టాక తొలిసారి జిల్లా కేంద్రానికి వచ్చినప్పుడు కరీం‘నగరాన్ని’ లండన్ తీరులో అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఆయన ఆలోచనకు అనుగుణంగా అద్భుతమైన ప్రాజెక్టులు వస్తున్నయ్. సీఎం వ్యాఖ్యలపై విపక్షాలు విమర్శలు చేస్తున్నయ్. అయితే లండన్ను ఇక్కడికి తేలేమని, కానీ ఇక్కడ ఉన్న పరిసరాలను ఆ తీరులో అభివృద్ధి చేసుకోవచ్చు. ఇప్పుడు అదే పద్ధతిలో మానేరు నదిపై మానేరు రివర్ ఫ్రంట్ ఏర్పాటవుతున్నది. నగర ప్రజలు ఊహించని విధంగా కేబుల్ బ్రిడ్జిని చేపట్టాం. త్వరలోనే అందుబాటులోకి తెస్తాం. విపక్షాల విమర్శలతో మాకు పని లేదు. అభివృద్ధే మా ప్రభుత్వ లక్ష్యం.
– రివర్ ఫ్రంట్ పనుల పరిశీలనలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్
కార్పొరేషన్, జూన్ 6: మానేరు రివర్ ఫ్రంట్ దక్షిణ భారత దేశంలో అద్భుతమైన ప్రాజెక్టుగా నిలుస్తుందని, భవిష్యత్తు తరాలకు ఆస్తిగా మారుతుందని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఉద్ఘాటించారు. కరీంనగర్ శివారులో మానేరు నదిపై నిర్మిస్తున్న కేబుల్ బ్రిడ్జి, మానేరు రివర్ ఫ్రంట్ పనులను సోమవారం రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్, మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్తో కలిసి పరిశీలించారు. అనంతరం ఫార్మసీ కళాశాల సమీపంలో స్టేడియం నిర్మాణం కోసం స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు గుజరాత్లోని సబర్మతి ప్రాజెక్టు తరహా కరీంనగర్లోని మానేరు నది అభివృద్ధికి ప్రణాళికలు వేశామని, సబర్మతి కంటే పది రెట్లు అద్భుతంగా రివర్ ఫ్రంట్ను తీర్చిదిద్దుతున్నామని వివరించారు. ఎల్ఎండీ డ్యాం కట్ట నుంచి 3.7 కిలోమీటర్ల మేర కు 410 కోట్లతో ప్రాజెక్టు పనులను చేపడుతున్నామని, అనుకున్న లక్ష్యం మేరకు సంతృప్తికరమైన తీరులోనే సాగుతున్నాయని తెలిపారు. కేబుల్ బ్రిడ్జి పనులు ఇప్పటికే పూర్త య్యాయని, అప్రోచ్ రోడ్డు పనులు శరవేగంగా సాగుతున్నాయని తెలిపారు. ఆగస్టు నాటికి పూర్తి చేసేందుకు లక్ష్యంగా పని చేస్తున్నామని చెప్పారు. మానేరు రివర్ ఫ్రంట్లో 12 ఫీట్ల మేర నీరు ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పా రు. పర్యాటకులు కరీంనగర్లో మూడు, నాలుగు రోజులు ఉండేలా ఈ ప్రాజెక్టును తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. ఇప్పటికే 35 కోట్ల వ్యయంతో అద్భుతమైన ఫౌంటెయిన్ను చేపడుతున్నామని, సియోల్ కంపెనీకి ఈ డిజైన్ పనులు అప్పగించామన్నారు. 12 కోట్లతో దుబాయ్ నుంచి బోట్స్ తీసుకువస్తున్నామని పేర్కొన్నారు. ఈ పనులన్నీ ఏడాదిన్నరలోగానే పూర్తి చేస్తామని చెప్పారు. నగరంలో చేపడుతున్న ఈ ప్రాజెక్టులు భవిష్యత్ తరాలు ఆహ్లాదంగా ఉండే విధంగా నిలుస్తాయని వివరించారు.
పర్యాటక కేంద్రంగా కరీంనగర్
రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్
కరీంనగర్ అతి త్వరలోనే పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతుం దని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమార్ ఉద్ఘా టించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్ కరీంనగర్ వచ్చారని, అప్పుడు ఈ నగరాన్ని లండన్ తీరులో అభివృద్ధి చేస్తామని చెప్పారని గుర్తు చేశారు. ఆయన ఆలోచన మేరకే అద్భుతమైన ప్రాజెక్టు లు వస్తున్నాయని వివరించారు. సీఎం వాఖ్యలపై కూడా విపక్షాలు విమర్శలు చేశాయని, అయితే లండన్ను ఇక్కడికి తీసుకురాలేమని, కానీ ఇక్కడ ఉన్న పరిసరాలను ఆ తీరులో అభివృద్ధి చేసుకోవచ్చని చెప్పారు. అదే పద్ధతిలో మానేరు నదిపై అద్భుతమైన మానేరు రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు వస్తున్నదని వివరించారు. మానేరు జీవ నదిగా మా ర్చాలన్న సీఎం ఆలోచన మేరకు రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులో 10 కిలోమీ టర్ల మేర ఎప్పుడు వాటర్ ఉండేలా ప్రాజెక్టును తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. మొదటి విడతలో 3.7 కిలోమీటర్ల మేర పనులు సాగుతు న్నాయని వివరించారు. అలాగే పద్మనగర్లో టీటీడీ వేంకటేశ్వర ఆలయాన్ని నిర్మిస్తున్నామని, ఇక్కడికి వచ్చే వారు కరీంనగర్లోనే బస చేసి వేములవాడ, ధర్మపురి, కొండగట్టు ప్రాంతాలను దర్శించుకునే విధంగా నగరం అభివృద్ధి చెందుతుందని వెల్లడించారు. విపక్షాల విమర్శలను పట్టించుకోమని, అభివృద్ధి లక్ష్యంగా పని చేస్తున్నామని పునరుద్ఘాటించారు. కార్యక్రమంలో మేయర్ సునీల్రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్రెడ్డి, రామడుగు సింగిల్ విండో చైర్మన్ వీర్ల వెంకటేశ్వర్రావు, కార్పొరేటర్ బండారి వేణు, టీఆర్ఎస్ నాయకులు జక్కుల నాగరాజు, పొన్నం అనిల్కుమార్గౌడ్, తిరుపతి నాయక్, దూలం సంపత్, తదితరులు ఉన్నారు.