కొత్తపల్లి, ఏప్రిల్ 8 : కార్మికుల కష్టాలతో పాటు పలు సమస్యలపై స్పష్టమైన అవగాహన ఉన్న బోయినపల్లి వినోద్కుమార్ను రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపించాలని ఆయన సతీమణి మాధవి విజ్ఞప్తి చేశారు. సోమవారం శాతవాహన యూనివర్సిటీలో పనిచేస్తున్న చింతకుంట, మలాపూర్ గ్రామాలకు చెందిన ఉపాధి హామీ కార్మికులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 2014 నుంచి 2019 వరకు పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసిన వినోద్కుమార్ కరీంనగర్ అభివృద్ధికి చేసిన కృషిని వారికి వివరించారు.
కరీంనగర్ మరింత అభివృద్ధి చెందాలంటే కేవలం వినోద్కుమార్తోనే సాధ్యమవుతుందన్నారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ కూలీలు వారు ఎదుర్కొంటున్న సమస్యలను వినోద్కుమార్ సతీమణికి వివరించారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ భూక్యా తిరుపతినాయక్, బీఆర్ఎస్ నాయకులు సంబోజు లతామల్లేశం, రాము, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.