గంభీరావుపేట, ఫిబ్రవరి 5: మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మంత్రిక కేటీఆర్ ప్రత్యేక చొరవతో సర్వాంగ సుందరంగా రూ పుదిద్దుకున్నది. అనుభవజ్ఞులైన అధ్యాపకులతో విద్యాబోధన చేస్తుండడంతో విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. ప్రస్తుతం కళాశాలలో విద్యార్థుల సంఖ్య 195కి చేరుకున్నది. భోజన సమయంలో స్థానిక విద్యార్థులు ఇంటికెళ్లి తిరిగివచ్చి సమయాన్ని వృథా చేసుకోకుండా, మధ్యా హ్న భోజనం అందించేందుకు నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు ముందుకొచ్చారు. విద్యార్థులందరికీ నాణ్యమైన భోజనం అందిస్తుండడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.
బంగారు భవిష్యత్కు బాటలు
మండల కేంద్రంలోని జూనియర్ కళాశాలలో విద్యార్థుల బంగారు భవిష్యత్కు బాటలు వేసేవిధంగా కళాశాలలో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5గంటల వరకు తరగతులతోపాటు స్టడీఅవర్స్ నిర్వహిస్తున్నారు. విద్యార్థుల ఆకలి తీర్చడానికి నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. దీంతో ప్రతిరోజూ కళాశాల ఆవరణలో మధ్యాహ్నం ఒంటి గంటకు రుచికరమైన భోజనాన్ని అందిస్తున్నారు. మధ్యాహ్న భోజనం అందించడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేసి, కొండూరికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
భోజనం బాగున్నది
మాది జగదాంబ తండా. ఉద యం 9గంటలకే కళాశాలకు వచ్చేముందు మధ్యాహ్నానికి బాక్సు తీసుకువచ్చే క్రమంలో వీలుండేదికాదు. లంచ్ టైంలో ఇంటికి వెళ్లలేని పరిస్థితుల్లో.. ఆకలితో సాయంత్రం వరకు ఇక్కడే ఉండి చదువుకొనేవాళ్లం. కొండూరి సారు అందిస్తున్న భోజనం బాగున్నది. కష్టపడి చదివి నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం.
– కళ్యాణి, సెకండియర్, జగదాంబతండా
సమయం ఆదా
కళాశాలలోనే మధ్యాహ్న భోజనం అందించడంతో ఇక్కడే తింటున్నాం. ఇంటికి వెళ్లే బదులు ఇక్కడే తినడంతో సమయం ఆదా అవుతున్నది. ఇంటి నుంచి బాక్సు తెచ్చుకునే ఇబ్బందులు
లేకుండా ఉన్నాయి.
– సానియా, సెకండియర్, గంభీరావుపేట
సేవలు మరచిపోలేము
విద్యార్థులకు మధ్యాహ్న భోజ నం అందిస్తున్న కొండూరి రవీందర్రావు సేవలు మరచిపోలేము. ప్రభుత్వం అందిస్తున్న వసతులను సద్వినియోగం చేసుకుంటూ ఉన్నతస్థాయికి చేరుకోవాలి. విద్యార్థులకు భోజనం అందించడం మా అదృష్టంగా భావిస్తున్నాం.
– వెంకట్నాయక్, ప్రిన్సిపాల్, గంభీరావుపేట