ధర్మపురి, జనవరి 13: ధర్మపురి శ్రీలక్ష్మీనర్సింహస్వామి వారి ఆలయ ఆవరణలోని శేషప్ప కళావేదికపై శుక్రవారం గోదారంగనాథుల కల్యాణోత్సం వైభవంగా నిర్వహించారు. ఆలయ వేదపండితులు బొజ్జ రమేశ్శర్మ, సామవేద పండితులు ముత్యాల శర్మ నేతృత్వంలో ఆలయ పురోహితులు సంపత్కుమార్ వేద మంత్రోచ్ఛారణల మధ్య కల్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
కాగా ధర్మపురిలో శుక్రవారం భక్తుల రద్దీ పెరిగింది. పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామిని దర్శించుకొని పూజలు నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో సంకటాల శ్రీనివాస్, రెనోవేషన్ కమిటీ సభ్యులు ఇనుగంటి రమా వేంకటేశ్వరరావ్, గందె పద్మశ్రీనివాస్, సురేందర్ తదితరులు ఉన్నారు.