మెట్పల్లి, మే 6: బ్రిటన్ దేశ రాజధాని లండన్ నగరంలో అక్కడి బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సెల్ ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావ వేడుకలను ఘనంగా ని ర్వహించారు. లండన్ పర్యటనలో ఉన్న కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు, తెలంగాణ చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి సంస్థ చైర్మన్ కూర్మాచలం అనిల్ వేడుకలకు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. కార్యక్రమంలో ముందుగా తెలంగాణ సిద్ధాంత కర్త ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం బీఆర్ఎస్ జెండా ను ఆవిష్కరించి ‘దేశ్కీ నేత కేసీఆర్’ అంటూ నినాదించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స మావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ర్టాన్ని సంక్షేమం, అభివృద్ధిలో దేశంలోనే అగ్రగామిగా నిలిపిన ఘనతా సీఎం కేసీఆర్దేనని పేర్కొన్నారు. విదేశాల్లో ఉంటూ ఉద్యమ సమయంలో ఎన్నారైలంతా క్రియాశీలకంగా పనిచేశారని, ప్రత్యేక రాష్ట్ర సాధనలో మీ కృషి అభినందనీయమన్నా రు. ఎన్నారై ఆడబిడ్డలు పార్టీ కార్యక్రమాలతో పాటు తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించేలా మన బతుకమ్మను విశ్వవ్యా ప్తం చేశారని కొనియాడారు. అనంతరం ఎఫ్డీసీ చైర్మన్ అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ, బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం చారిత్రాత్మకమన్నా రు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో దేశ నలుమూలల గులాబీ జెండా ఎగరాలని దేశ ప్రజలంతా కోరుకుంటున్నారని చెప్పారు.
బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి మా ట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్, వరింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ తనకు పార్టీలో పని చే సేందుకు అవకాశం కల్పించినందుకు కృతఙ్ఞతలు తెలిపారు. అనంతరం ఎన్నారైలు ఎమ్మె ల్యే, ఎఫ్డీ సీ చైర్మన్ను సన్మానించి జ్ఞాపికను అందజేశారు. ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ సెల్ (యూ కే) అధ్యక్షులు అశోక్గౌడ్, ప్రధాన కార్యదర్శి రత్నాకర్, అడ్వయిజరీ బోర్డు ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్ గౌడ్, ఉపాధ్యక్షుడు నవీన్రెడ్డి, నాయకులు సత్యమూర్తి, హరిగౌడ్, సంజయ్, సతీశ్రెడ్డి, మల్లారెడ్డి, నవీన్, రవి ప్రదీప్, సత్యపాల్, సురేశ్ బుడగం, రమేశ్, నవీన్రెడ్డి, ప్రశాంత్, గోపతి సురేశ్, మామిడాల ప్ర శాంత్, మధు యాదవ్, ప్రవాస సంఘాల నాయకులు గణేశ్, రంజిత్, స్వాతి, జాహ్నవి, సుప్రజ, క్రాంతి, శ్రావ్య, విద్య, స్నేహ, పావని, మాధవ్, దీపాక్షర, రవికిరణ్, వంశీ పాల్గొన్నారు.