మెట్పల్లి, మార్చి 22: పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ సమీపంలో 63వ జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న మహాలక్ష్మి మద్యం దుకాణం(వైన్షాపు)లో చోరీ జరిగింది. ము ఖానికి మంకీ టోపీ ధరించి ఉన్న దుండగుడు మంగళవారం అర్ధరాత్రి 12 నుంచి 12.30 గంటల సమయంలో మద్యం దుకాణంలోకి చొరబడ్డాడు. క్యాష్ కౌంటర్లో ఉన్న నగదు ను, పలు బ్రాండ్లకు చెందిన మద్యం బాటిళ్లను ఎత్తుకెళ్లాడు. పోతు పోతూ దుకాణంలో ఉన్న పలు సీసీ కెమెరాలు, మరి కొన్ని మద్యం సీసాలను ధ్వంసం చేశాడు.
ఉదయం మద్యం దుకా ణం తెరిచి చూడగా ధ్వంసమైన మద్యం బాటి ళ్లు, చెల్లచెదురుగా పడి ఉన్న ఫర్నీచర్ కన్పించింది. వెంటనే యజమానులు స్థానిక పోలీసులకు సమాచారం అందించగా, వారు ఘటనా స్థలాన్ని పరిశీలించి దొంగతనం జరిగిన తీరును సీసీ కెమెరాలో రికార్డయిన ఫుటేజీలను పరిశీలించారు. క్యాష్ కౌంటర్లో నిల్వఉన్న రూ.80 వేలు, మరో రూ.50 వేలు మ ద్యం అపహరణకు గురైందని, మద్యం సీసాలు, సీసీ కెమెరా ల ధ్వంసం మరో రూ. 20 వేలు పైగా ఉంటుం దని మద్యం దుకాణం నిర్వహకులు తెలిపారు. బాధిత యజమాని శ్రీపతి రఘు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.