కరీంనగర్ రాంనగర్, మే 30 : ఉత్తర తెలంగాణలోనే అన్ని రంగాల్లో కరీంనగర్ ది ప్రత్యేక స్థానం. ఇక మద్యం విషయం చెప్పనవసరం లేదు. ఇక ఎండాకాలం కావడంతో మద్యం విక్రయాలు మరింతగా పెరిగిపోతుంటాయి. ఈసారి ఏప్రిల్, మే రెండు నెలల్లోనే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రూ.629 కోట్ల మద్యం విక్రయాలు జరిగినట్లు అధికారుల రికార్డులు చెబుతున్నాయి. ఇందులో బీర్ల విక్రయాలే అధికంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆయా జిల్లాల వారీగా విక్రయాలు ఇలా ఉన్నాయి.
