విద్యానగర్, జనవరి 21: కరీంనగర్లటోని పేద ప్రజల కోసం లయన్స్ క్లబ్, ప్రతిమ దవాఖానల ఆధ్వర్యంలో భగత్నగర్లోని అల్ఫోర్స్ ఈ టెక్నో స్కూల్ ఆవరణలో ఆదివారం నిర్వహించిన సూపర్ స్పెషాలిటీ ఉచిత మెగా వైద్య శిబిరం సక్సెస్ అయింది. నగరంలోని పేద ప్రజలు తరలివచ్చారు. ఇక్కడ 813 మందికి స్రీనింగ్ చేశారు. 176 మందికి ఈసీజీ, 115 మందికి 2డీ ఏకో, 422 మందికి జీఆర్బీఎస్ పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.
కాగా, మేయర్ సునీల్ రావు ముఖ్య అతిథిగా హాజరై వైద్య శిబిరాన్ని ప్రారంభించి, మాట్లాడారు. పేదలకు సూపర్ స్పెషాలిటీ వైద్యం ఉచితంగా అందించడం గొప్ప విషయమన్నారు. కార్యక్రమంలో కరీంనగర్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ సతీమణి సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ మాధవి, ప్రముఖ గుండె వైద్య నిపుణులు డాక్టర్ రవీందర్ రెడ్డి, ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ జగన్ మోహన్రావు, ఎండోక్రైనాలజీ డాక్టర్ కొండ చైతన్య, కీళ్ల వైద్య నిపుణులు డాక్టర్ శ్రవణ్ కుమార్, పల్మనాలజీ డాక్టర్ సీఎన్ ప్రసాద్, గ్యాస్ట్రోఎంట్రాలజీ డాక్టర్ ప్రణీత్, లయన్ డాక్టర్ దిలీప్ రావు, ప్రతిమ హాస్పిటల్ రిజిస్ట్రార్, అడ్మినిస్ట్రేటర్ పీ ప్రసాద్ రావు, జిల్లా గవర్నర్ లయన్ హెచ్ రాజిరెడ్డి, లయన్ నారాయణరెడ్డి, ఎప్వీడీజీ వెంకటేశ్వర రావు, ఎస్వీడీజీ ఎస్ కోదండరాం, అల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ వీ నరేందర్రెడ్డి, డీసీఎస్ వెంకట రమణారెడ్డి ఉన్నారు.