ధర్మారం : పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం ఖిలావనపర్తి గ్రామ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలకు లయన్స్ క్లబ్ ( Lions Club ) నిర్వాహకులు వివిధ రకాల సామగ్రిని బహుకరించి సేవా గుణాన్ని చాటుకున్నారు. రూ.15 వేల విలువైన ఫోర్టేబుల్ సౌండ్ సిస్టం ( Sound System ), వాటర్ బాటిళ్లు అందచేశారు. పాఠశాలలో క్లబ్ చైర్మన్ బీ రాంకిషన్, సెక్రటరీ ఎం సత్యనారాయణ ,కోశాధికారి కే.మహేందర్ రావు బుధవారం స్థానిక సర్పంచ్ మోతే కనకయ్యతో కలిసి పాఠశాల హెడ్మాస్టర్స్వప్నకు అందజేశారు.
ఈ సందర్భంగా దాతలను పాఠశాల ఉపాధ్యాయులు సన్మానించారు. సేవా దృక్పథంతో పాఠశాలకు సౌండ్ సిస్టం తో పాటు విద్యార్థులకు వాటర్ బాటిల్ లను బహుకరించిన క్లబ్ వారికి ఉపాధ్యాయులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా క్లబ్ సభ్యులు మాట్లాడుతూ సర్కారు బడుల్లో చేర్పించే తల్లిదండ్రులను సన్మానించి తగిన బహుమతిని అందజేస్తామని ప్రకటించారు .
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మోతే కావ్య, లక్ష్మీనరసింహస్వామి ఆలయ కమిటీ చైర్మన్ పోలుదాసరి సంతోష్, పంచాయతీ వార్డు సభ్యులు, ఉపాధ్యాయులు వి. వెంకటేశ్వర్లు, దేవి జయ, ఎం అర్చన, ఎ. సుధీర్ కుమార్, ఈ సంతోష్ కుమార్, ఎన్ సిద్ధిరాములు, అంగన్ వాడీ టీచర్, తదితరులు పాల్గొన్నారు.