బోసిపోయిన క్యూలైన్లు
భక్తులు లేక ఆవరణ వెలవెల
వేములవాడ టౌన్, జూలై 4 : వేములవాడ రాజన్న ఆలయంలో ఆషాఢం ఎఫెక్ట్ కనిపించింది. సోమవారం ఉదయం కొద్ది మంది భక్తులతో సందడిగా కనిపించినా మధ్యాహ్నం వేళ భక్తులు లేక బోసిపోయింది. అంతంత మాత్రంగానే స్వామివారిని దర్శించుకున్నారని ఆలయ అధికారులు తెలిపారు.
మధ్యాహ్నం ఏ క్యూలైన్ చూసినా వెలవెలబోయినట్లు కనిపించింది. దీంతో ఆలయ మెట్ల కింద కొబ్బరికాయలు అమ్మేవారు, గాజులు వేసేవారు, చిరు వ్యాపారులు తమ దుకాణాలను మధ్యాహ్నం కల్లా మూసుకుని తమ ఇండ్లకు వెళ్లారు.