Collector Koya Sriharsha | ధర్మారం ,జూలై 23 : ధర్మారం మండలంలోని పైడిచింతలపల్లి గ్రామంలో జరుగుతున్న భూముల రీ సర్వేను సంబంధిత శాఖ సిబ్బంది పారదర్శకంగా నిర్వహించాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. ఈ మేరకు గురువారం ఆ గ్రామాన్ని ఆయన సందర్శించారు. భూముల రీ సర్వే ప్రక్రియను ఆయన పరిశీలించారు. సర్వే చేస్తున్న చేస్తున్న తీరును సర్వ సిబ్బంది కలెక్టర్ కు వివరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కలెక్టర్ శ్రీ హర్ష మాట్లాడుతూ భూములన్నింటినీ నిబంధనల ప్రకారం సర్వే చేసి పారదర్శకంగా నమోదు చేయాలని ఆయన ఆదేశించారు.
గ్రామసభల ద్వారా రైతులకు రీ సర్వే ప్రయోజనాలను వివరించి ప్రజల పూర్తి సహకారంతో ప్రక్రియను విజయవంతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీటీ ఉదయ్ కుమార్, ఆర్ఐ-2 నవీన్ రావు, మండల సర్వేయర్ శ్రీనివాస్, సర్వే సిబ్బంది పాల్గొన్నారు.