ప్రతి పనిలోనూ ప్రజలను భాగస్వాములను చేసినప్పుడే.. మంచి ఫలితాలు వస్తాయి. ఈ దిశగా కార్పొరేటర్లు పనిచేయాలి. పరిశుభ్రత మార్పు ప్రతి కార్పొరేటర్ నుంచే మొదలు కావాలి. నాలుగున్నర లక్షల మంది ప్రజలు 85 వేల ఇండ్లున్న కరీంనగర్ కార్పొరేషన్లో 1400 మంది శానిటేషన్ సిబ్బంది పనిచేస్తున్నారు. ప్రజల భాగస్వామ్యం లేకపోతే.. క్లీన్ సిటీ ఎలా సాధ్యం అవుతుందో ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. 2014కు ముందు, ప్రస్తుతం ఉన్న కరీంనగర్ను ఒక్కసారి బేరీజు వేసుకోవాలి. మంత్రి గంగుల కమలాకర్, మేయర్ సునీల్రావు అద్భుతంగా పనిచేస్తున్నారు. ఇద్దరికీ మున్సిపల్తో అనుభవాలున్నాయి. ఆ అనుభవాన్ని రాష్ట్రంలో కరీంనగర్ను నంబర్వన్గా తీర్చిదిద్దేందుకు వినియోగించాలి. కరీంనగర్ కార్పొరేషన్ను అదర్శవంతంగా తీర్చిదిద్దాలి. ఇందుకోసం ఎన్ని నిధులైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం.
కార్పొరేషన్, జూన్ 21: మున్సిపల్ కార్పొరేషన్ పరిధి లో జరిగే ప్రతి పనిలోనూ ప్రజలను భాగస్వాములను చేసినప్పుడే.. మంచి ఫలితాలు వస్తాయని రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ దిశగా కార్పొరేటర్లు పనిచేయాలని సూచించా రు. పరిశుభ్రత మార్పు ప్రతి కార్పొరేటర్ ఇంటి నుంచే మొదలు కావాలన్నారు. బుధవారం కరీంనగర్లో వివిధ కార్యక్రమాల ప్రారంభం అనంతరం మంత్రి కార్పొరేటర్లతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నాలుగున్నర లక్షల మంది ప్రజలు 85వేల ఇండ్లున్న కరీంనగర్ కార్పొరేషన్లో 1400 మంది శానిటేషన్ సిబ్బంది పనిచేస్తున్నారని, ప్రజల భాగస్వామ్యం అనేది లేకపోతే.. క్లీన్ సిటీ ఎలా సాధ్యం అవుతుందో ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉందని సూచించారు. 2014కు ముందు, ప్రస్తు తం ఉన్న కరీంనగర్ను ఒక్కసారి బేరీజు వేసుకోవాలని సూచించిన మంత్రి.. ఇటు మంత్రి గంగుల కమలాకర్, మేయర్ సునీల్రావు అద్భుతంగా పనిచేస్తున్నారని కితా బు ఇచ్చారు. ఇద్దరికీ మున్సిపల్తో అనుబంధాలున్నాయని పేర్కొన్న మంత్రి.. ఆ అనుభవాన్ని రాష్ట్రంలో కరీంనగర్ను నంబర్వన్గా తీర్చిదిద్దేందుకు వినియోగించాలని సూచించారు.
కరీంనగర్ కార్పొరేషన్ను అదర్శవంతంగా తీర్చిదిద్దాలని, ఇందుకోసం ఎన్ని నిధులైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని హామీ ఇచ్చారు. ఇచ్చిన ప్రతి పైసా సద్వినియోగం అయి.. ఆ ఫలాలు ప్రజలకు అందుతుం టే.. మరిన్ని నిధులు ఇవ్వాలనిపిస్తుందన్నారు. కరీంనగర్లో మంత్రి, మేయర్ పట్టుబట్టి.. జతకట్టి అభివృద్ధి పను లు ముందుకు తీసుళ్తున్నారని చెప్పారు. నిజానికి తాను పుట్టింది ఇక్కడేనని, పెరిగింది ఇక్కడేనని, చదుకున్నది ఇక్కడేనని అన్న చెప్పిన మంత్రి.. ఆనాటి కరీంనగర్ నేటి కరీంనగర్కు ఏమాత్రం పోలిక లేదన్నారు. రోజు రోజుకూ పురోగమనంలో పయనిస్తుందన్నారు. బుధవారం ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసుకున్న పనులతోపాటు 224 కోట్లతో చేపట్టిన తీగల వంతెన కరీంనగర్కు మరో మణిహారం అవుతుందన్నారు. దీంతోపాటు 480 కోట్ల తో నిర్మిస్తున్న మానేరు రివర్ఫ్రంట్ నాలుగైదు నెలల్లో పూర్తయితే.. అద్భుత పర్యాటక కేంద్రంగా తయారవుతుందన్నారు. అతేకాదు.. కరీంనగర్లోని ప్రతి పౌరుడూ అబ్బురపడుతారని, అలాగే.. పిల్లలే తల్లిదండ్రులను తీసుకెళ్లి మానేరు రివర్ ఫ్రంట్ వద్ద ఫొటోలు దిగేస్థాయిలో రివర్ఫ్రంట్ ఉంటుందన్నారు. ప్రజల బేసిక్ అవసరాల తీర్చడానికి ప్రధాన ప్రాధాన్యమివ్వాలని సూచించిన మంత్రి.. కరీంనగర్లో ప్రస్తుతం ప్రతి రోజూ మంచినీరు సరఫరా చేస్తూ నగరపాలక సంస్థ ఆదర్శంగా నిలుస్తుందన్నారు.
దీనిని 24గంటల పాటు సరఫరాచేయాలని ఆలోచిస్తున్నారని, త్వరలోనే ఆ ప్రక్రియకు కూడా శ్రీకారం చుడుతున్నట్లుగా మంత్రి గంగుల చెప్పడం సంతోషంగా ఉందన్నారు. దేశంలో పక్షం రోజులకోమారు నీళ్లు ఇవ్వలేని పరిస్థితులున్న ఈరోజుల్లో 24 గంటల పాటు మంచి నీళ్లు ఇవ్వాలన్న లక్ష్యంతో పనిచేస్తున్న మంత్రి, మున్సిపల్ పాలకవర్గాన్ని అభినందించారు. నగరంలో పరిశుభ్రతకు పెద్దపీట వేస్తున్నట్లు మేయర్ సునీల్రావు చెప్పారని, ఇప్పటికే 130 వాహనాలను ఇందుకోసం కొనుగోలు చేసినట్లు చెప్పారని తెలిపారు. బయోమైనింగ్ ప్రారంభించాలని సూచించిన మంత్రి.. మొట్టమొదటగా పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ను కరీంనగర్లో ఏర్పాటుచేయడం అభినందనీయమన్నారు. కౌన్సి ల్ సభలు, సమావేశాల్లో కొంత మంది ఇష్టానుసారం మా ట్లాడుతూ, ప్రజాసమస్యలపై చర్చ జరగకుండా చూస్తున్నారని, అందుకే, కౌన్సిల్ సమావేశ మందిరంలోకి మీడియాకు అనుమతులు ఇవ్వడం లేదని తేల్చిచెప్పారు. పరిశుభ్రత విషయంలో.. ప్రజలకు అవగాహన కల్పించేందు కు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించిన మంత్రి.. కరీంనగర్లోనూ స్వచ్ఛబడి ప్రారంభించాలని సూచించారు.
మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ తెచ్చిన సంస్కరణలు ఆమోఘమని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ ప్రశంసించారు. ఆయన నేటి తరానికి స్ఫూర్తివంతమైన నాయకుడని కొనియాడారు. కేటీఆర్ చేపట్టిన సంస్కరణలకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని పేర్కొన్నారు. బుధవారం కరీంనగర్ కార్పొరేటర్లతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా తన గత అనుభవాలను గుర్తు చేసుకున్నారు. తన రాజకీయ జీవితం మున్సిపల్ కౌన్సిలర్తోనే ప్రారంభమైందని చెప్పారు. నాటి పాలకులకు అభివృద్ధి పనుల కోసం దరఖాస్తు ఇచ్చి దండం పెట్టినా..నయాపైసా ఇవ్వలేదన్నారు. కానీ సీఎం కేసీఆర్ అధికారం చేపట్టిన వెంటనే కరీంనగర్ కార్పొరేషన్ అభివృద్ధికి రూ. 350 కోట్లు మంజూరు చేశారని తెలిపారు. ఈ నిధులతో శరవేగంగా అభివృద్ధి, సుందరీకరణ పనులు చేపట్టామన్నారు. ఈ పనులను చూసి ప్రజలు ఫీదా అయ్యారని చెప్పారు. రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుంచి నగరంలో వేలకోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. గతంలో కార్పొరేటర్లు చేసిన పనులను చెప్పుకోలేక, ప్రజలకు సమాధానం చెప్పలేక ఇబ్బందులు పడేవారన్నారు. కానీ ఇప్పుడు నిర్విఘ్నంగా పనులు జరుగుతున్నాయని వెల్లడించారు. తద్వారా కార్పొరేటర్లకు ప్రజల్లో గౌరవం పెరిగిందని చెప్పారు. మంత్రి కేటీఆర్ తెచ్చిన మున్సిపల్ సంస్కరణలతో ప్రపంచమే ఆశ్చర్యపోతున్నదన్నారు. ప్రభుత్వ నిధులను సద్వినియోగం చేసుకొని హైదరాబాద్ తర్వాత కరీంనగర్ అభివృద్ధిలో దూసుకెళ్తున్నదని చెప్పారు. అడిగిన వెంటనే నిధులిచ్చిన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్కు తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు.
మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ తెచ్చిన సంస్కరణలు అమోఘం. ఆయన నేటి తరానికి స్ఫూర్తివంతమైన నాయకుడు. నా రాజకీయ జీవితం మున్సిపల్ కౌన్సిలర్తోనే ప్రారంభమైంది. నాటి పాలకులకు అభివృద్ధి పనుల కోసం దరఖాస్తు ఇచ్చి దండం పెట్టినా..నయాపైసా ఇవ్వలేదు. కానీ, సీఎం కేసీఆర్ అధికారం చేపట్టిన వెంటనే కరీంనగర్ కార్పొరేషన్ అభివృద్ధికి రూ.350 కోట్లు మంజూరు చేశారు. ప్రభుత్వ నిధులను సద్వినియోగం చేసుకొని హైదరాబాద్ తర్వాత కరీంనగర్ అభివృద్ధిలో దూసుకెళ్తున్నది. సీఎం కేసీఆర్, కేటీఆర్ అండతోనే రూ. వేల కోట్లతో నగరాన్ని అద్భుతంగా తీర్చిదిద్దినం. ఇక్కడి మానేరుపై దక్షిణ భారత దేశంలోనే అతి పెద్ద కేబుల్ బ్రిడ్జిని నిర్మించినం. మానేరు రివర్ ఫ్రంట్ పనులు శరవేగంగా సాగుతున్నయి. ప్రపంచంలోనే మూడో అద్భుతమైన పౌంటేయిన్ను అందుబాటులోకి తెస్తున్నం.
కరీంనగర్కార్పొరేషన్ పరిధిలో ఇప్పటికే 2 వేల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని మేయర్ సునీల్రావు తెలిపారు. మంత్రి కేటీఆర్ అడుగుజాడల్లోనడుస్తూ ప్రగతిని పరుగులు పెట్టిస్తున్నామని చెప్పారు. నగరంలో పార్టీలకతీతంగా అన్ని డివిజన్లలో పనులు చేపడుతున్నామన్నారు. మున్సిపల్శాఖ మంత్రిగా కేటీఆర్తెచ్చిన అనేక సంస్కరణల వల్లే స్థానికసంస్థలు అభివృద్ధిలో ఆదర్శంగా నిలుస్తున్నాయని చెప్పారు. బర్త్, డెత్, మ్యూటేషన్ సర్టిఫికెట్లకు మున్సిపల్కు రావాల్సిన అవసరం లేకుండా చేశామన్నారు.ప్రాపర్టీ టాక్సు విషయంలో ఇస్తున్న 25 శాతం రిబేట్ ప్రజల్లో మంచి పేరు తెచ్చిపెట్టిందన్నారు. గతంలో 145 కోట్లను ఆర్బన్ భగీరథకింద రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం వల్ల నగరంలో ప్రతిరోజు మంచినీటి సరఫరా చేస్తున్నామని చెప్పారు. మరో 145 కోట్లతో వీలీన గ్రామాలకు మంచినీరు అందించే పనులు కొనసాగుతున్నాయన్నారు. 345 కోట్ల సీఎం అష్యూరెన్స్నిధులతోచేసిన పనులు నగర రూపురేఖలను మార్చామని మేయర్ పేర్కొన్నారు.