రాబోయేది కేసీఆర్ ప్రభుత్వమేనని, కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసుకుందామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆకాంక్షించారు. సిరిసిల్లోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పదో తరగతి ఫలితాల్లో ఉత్తమ మార్కులు సాధించిన సిరిసిల్ల నియోజకవర్గంలోని 30 మంది ప్రభుత్వ విద్యార్థులకు ‘గిప్ట్ ఏ స్మైల్’ కింద ట్యాబ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు.
నేటి డిజిటల్ యుగంలో సాంకేతిక పరిజ్ఞానం విద్యార్థులకు ఎంతో అవసరమని, ఈ ట్యాబ్లను విద్యాభివృద్ధికి వినియోగించుకోవాలని, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని సూచించారు. ఇంటర్, డిగ్రీలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులను సైతం అవసరమై ప్రోత్సాహకం అందిస్తామని చెప్పారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు అన్నింటినీ కార్పొరేట్కు దీటుగా అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎనిమిది స్కూళ్లలో కార్పొరేట్కు దీటుగా వసతులు కల్పించామని వివరించారు.