కొత్తపల్లి, జనవరి 9 : మంచిర్యాల జిల్లాలోని మందమర్రిలో ఈనెల 7 నుంచి 9 వరకు జరిగిన 44వ రాష్ట్రస్థాయి జూనియర్ హ్యాండ్బాల్ పోటీల్లో ఉమ్మడి కరీంనగర్ జట్టు క్రీడాకారులు సత్తా చాటి కాంస్య పతకం కైవసం చేసుకున్నట్లు అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు వీర్ల వెంకటేశ్వర్రావు, బసరవేణి లక్ష్మణ్ పేర్కొన్నారు. చెన్నూర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ చేతుల మీదుగా జిల్లా జట్టు క్రీడాకారులు కాంస్యం ట్రోఫీని అందుకున్నా రు.
ఈ టోర్నమెంట్లో వరంగల్ జట్టు విజేతగా నిలువగా, రన్నరప్గా హైదరాబాద్, 3వ స్థానంలో కరీంనగర్, 4వ స్థానంలో నల్గొండ జట్లు నిలిచాయి. కాంస్య పతకం గెలుపొందిన క్రీడాకారులను డీవైఎస్వో కె రాజవీరు, క్రీడా సంఘాల ప్రతినిధులు నందెల్లి మహిపాల్, గసిరెడ్డి జనార్దన్రెడ్డి, కాసర్ల ఆనంద్కుమార్, రమణారావు, నమిలికొండ ప్రభాకర్, మూల వెంకటేశ్ తదితరులు అభినందించారు. భవిష్యత్ లో మరింతగా రాణించాలని ఆకాంక్షించారు.