మెట్పల్లి/కోరుట్ల రూరల్, జూన్ 16: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమం దేశానికే ఆదర్శమని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మెట్పల్లి పట్టణంలోని నరేందర్ రెడ్డి గార్డెన్స్, కోరుట్ల పట్టణంలోని జీఎస్ గార్డెన్స్లో వేర్వేరుగా శుక్రవారం పట్టణ ప్రగతి సంబరాలు అట్టహాసంగా జరిగాయి. సంబరాల్లో పాల్గొ న్న ఎమ్మెల్యే విద్యాసాగర్రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం రాక ముందు కనీస అభివృద్ధికి నోచుకోలేక మున్సిపాలిటీలు అప్పటి ప్రభుత్వాల తీరుతో అధ్వానంగా ఉండేవన్నారు. స్వరాష్ట్రంలో కనీవిని ఎరుగని రీతిలో గడిచిన తొమ్మిదేండ్లలో మున్సిపాలిటీల రూపురేఖలు మారాయని, ప్రభు త్వం కేటాయిస్తున్న నిధులతో అభివృద్ధి వైపు పట్టణాలను పరుగులు పెట్టిస్తున్నదన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పారిశుధ్య కార్మికుల వేతనాలు రెట్టింపు చేశారని, వారి సేవలు మరిచిపోలేనివన్నారు. పారిశుధ్య కార్మికులకు డబుల్ బె డ్రూం ఇండ్లు, ఒప్పంద కార్మికులను క్రమబద్ధీకరణ అంశాలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. కోరుట్ల పట్టణానికి పలు అవార్డులు రావడం అభినందనీయమని, సమష్టి కృషితోనే ఇది సాధ్యమైందని చె ప్పారు.
ప్రజలకు మరింతగా మెరుగైన వైద్యం చేరువ చేసేందుకు కోరుట్ల పట్టణంలో వంద పడకల హాస్పిటల్, బస్తీ దవాఖానను ఏర్పాటు చేసిందన్నారు. కిడ్నీ వ్యాధిగ్రస్తుల కోసం డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. కోరుట్ల, మెట్పల్లి పట్టణాల సుందరీకరణ, అభివృద్ధిలో భాగం గా కోట్లాది రూపాయల నిధులతో డివైడర్లు, సెంట్రల్ లైటింగ్ సిస్టమ్, వైకుంఠధామాల అభివృ ద్ధి, మద్దెల చెరువు, పెద్ద చెరువులను మినీ ట్యాంక్ బండ్, సమీకృత మార్కెట్ల నిర్మాణం, పబ్లిక్ టాయిలెట్లు, ఓపెన్ జిమ్లు, చిల్డ్రన్స్ పార్కులు, అంతర్గతంగా సీసీ రోడ్లు, డ్రైనేజీలు వంటి అనేక పనులు చేపట్టామని వివరించారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో అభివృద్ధిలో కోరుట్ల, మెట్పల్లి పట్టణాలు ముందంజలో ఉన్నాయన్నారు. అంతకుముందు కోరుట్ల, మెట్పల్లి ప ట్టణాల్లో మున్సిపల్ పాలకవర్గాలు, అధికారులు, ఉద్యోగులు, పారిశుధ్య కార్మికులు ర్యాలీలు నిర్వహించారు. కోరుట్లలో ఎమ్మెల్యే విద్యాసాగర్రావు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించి పాల్గొన్నారు. అదే విధంగా మెట్పల్లి మున్సిపల్ అధ్యక్షురాలు రాణవేని సుజాత ర్యాలీ మున్సిపల్ కార్యాలయం నుంచి అధికారులు, కార్మికులతో కలిసి నరేందర్రెడ్డి గార్డెన్స్కు ర్యాలీగా చేరుకున్నారు.
పారిశుధ్య కార్మికులకు ప్రశంసా పత్రాలు
పట్టణ ప్రగతి ఉత్సవాలలో భాగంగా ఉత్తమ సేవలు అందిస్తున్న పారిశుధ్య కార్మికులను కోరుట్ల, మెట్పల్లి పట్టణాల్లో ఎమ్మెల్యే విద్యాసాగర్రావు సన్మానించారు. జ్ఞాపికలు, ప్రశంసా పత్రాలను అందజేశారు. అనంతరం సహపంక్తి భోజనాలు చేశారు. మెట్పల్లిలో జరిగిన ఉత్సవాల్లో కార్మికులకు ఎమ్మెల్యే భోజనం వడ్డించారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ కార్మికులతో కలిసి భోజనం చేశారు. సంబరాల్లోనూ వేదిక ముందు కార్మికులతో కలిసి కూర్చొని వీక్షించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కోరుట్ల పట్టణ సంబరాల్లో మున్సిపల్ అధ్యక్షురాలు అన్నం లావణ్య, ఉపాధ్యక్షులు గడ్డంమీది పవన్, కమిషనర్ ఆయాజ్, మున్సిపల్ కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు తదితరులు పాల్గొన్నా రు. మెట్పల్లి పట్టణ ప్రగతి సంబరాల్లో మున్సిపల్ అధ్యక్షురాలు రాణవేని సుజాత, ఉపాధ్యక్షులు బోయినపల్లి చంద్రశేఖర్రావు, కమిషనర్ జగదీశ్వర్గౌడ్, విద్యుత్ ఏడీఈ మనోహర్, ము న్సిపల్ కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు ఉన్నారు.