ఇబ్రహీంపట్నం, జూన్ 30 : ప్రజల సౌకర్యార్థమే హైలెవల్ బ్రిడ్జిలు నిర్మిస్తున్నామని కోరుట్ల ఎమ్మె ల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు స్పష్టం చేశారు. ప్రజా సంక్షేమమే ధ్యేయమని, నియోజక వర్గ అ భివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నామని, రానున్న రోజుల్లో నియోజక వర్గాన్ని రాష్ట్రంలో అగ్రగామి గా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఇబ్రహీంపట్నం మండలంలోని ఇబ్రహీంపట్నం-వర్షకొండ గ్రా మాల మధ్య రెండు హైలెవల్ బ్రిడ్జిల నిర్మాణానికి 4కోట్లు, కోమటికొండాపూర్-ఎర్దండి గ్రామాల మధ్య హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి 2 కోట్లు, యామాపూర్ ఫకీర్ కొండాపూర్ గ్రామాల మధ్య హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి 4కోట్లు ఆర్అండ్బీ నిధులు మంజూరు కాగా, శుక్రవారం ఆయాచోట్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే భూమిపూజ చేసి శిలాఫలకం ఆవిష్కరించారు. అంతకుముందు ఇబ్రహీంపట్నం మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో మండలంలోని 27కుల సంఘాలకు, ఒక మహిళా సంఘానికి సీడీపీ నిధుల నుంచి మంజూరైన 50.50లక్షల విలువైన ప్రొసీడింగ్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు.
ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఫలాలందిస్తున్నామని చెప్పారు. అడగకముందే వరాలు ఇచ్చే దేవుడు సీఎం కేసీఆర్ అని, ఆయన సహకారంతో కుల సంఘాల అభ్యున్నతికి కృషి చేస్తున్నామని చెప్పారు. రానున్న రోజుల్లో ప్రతి సంఘ భవన నిర్మాణానికి నిధులు మంజూరుకు కృషి చేస్తానన్నారు. ప్రతి దళిత కుటుంబానికీ దళితబంధు అందించేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని, రాబోయే మూడు, నాలుగేళ్లలో అర్హులందరికీ అం దిస్తామని స్పష్టం చేశారు. మండలంలోని అన్ని గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన కోసం ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. పనిచేసే ప్రభుత్వానికి ప్రజలు ఎల్లవేళలా అండగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం వర్షకొండ చర్చిలో ప్ర త్యేక ప్రార్థనలు చేశారు. చర్చి నిర్మాణానికి 6లక్షల నిధుల ఇచ్చేందుకు కృషి చేస్తానని హామీ ఇ చ్చారు.
వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఏర్పా టు చేసిన హైమాస్ట్ లైట్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జాజాల భీమేశ్వరి, జడ్పీటీసీ కంఠం భారతి, వైస్ ఎంపీపీ నోముల లక్ష్మారెడ్డి, సర్పంచుల ఫోరం అధ్యక్షురాలు నేమూరి ల త, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు పొన్కంటి వెం కట్, సింగిల్ విండో చైర్మన్ బద్దం గోపి, సర్పంచు లు దొంతుల శ్యామల, కుప్పెల శ్రీనివాస్, గుంటి లక్ష్మి, సోమ ప్రభాకర్, సంగం సాగర్, ఎంపీటీసీ లు జలేశ్, చిన్నారెడ్డి, రాములు, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఎలాల ధశరథరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు నే మూరి సత్యనారాయణ, కంఠం రమేశ్, జగన్ రావు, అల్లూరి రఘుపతిరెడ్డి, నేరెళ్ల దేవెందర్, మ హేశ్, ఆనంద్, సత్యం, తుకారాం, సురేశ్ రెడ్డి, జే డీ సుమన్, చిన్నరాజన్న, రవికాంత్ రెడ్డి, జిల్లాల పవన్, జింక శ్రీనివాస్, రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.