ఇబ్రహీంపట్నం, డిసెంబర్ 18: నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తానని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల పేర్కొన్నారు. సోమవారం ఆయన మండలంలోని అమ్మక్కపేట, డబ్బ, వర్షకొండ గ్రామాల్లో పర్యటించగా, బీఆర్ఎస్ నాయకులు, గ్రామస్తులు ఘనంగా సన్మానించి నోట్బుక్లు, పెన్నులు అం దజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటానని, అభివృద్ధితోపాటు సేవ చేస్తానని, ఏ కష్టం వచ్చినా తన దృష్టికి తీసుకురావాలని కోరారు. తనవంతు సహాయ సహకారాలను అందించేందుకు కృషి చేస్తానని స్పష్టం చేశారు.
కేసీఆర్ ప్రభు త్వం మరోసారి అధికారంలోకి రాలేదని కార్యకర్తలు అధైర్యపడొద్దని.. మీకు నేనున్నానని భరోసానిచ్చారు. యువతకు ఉద్యోగవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తానని, యువత సోషల్ మీడియా మహమ్మారికి దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. రైతులకు ఈ నెల 9నే రైతుబంధు ఎకరాకు 15వేలు ఇస్తానని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఇవ్వలేదన్నారు. రైతు బంధు, రైతు బీమాకు మధ్య తేడా కాంగ్రెస్ నాయకులకు తెలియదని ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో నియోజకవర్గ సమస్యలపై మాట్లాడుతుంటే మైకులు కట్ చేస్తున్నారన్నారు. వచ్చే స్థానిక సం స్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
అమ్మక్కపేటలో కాసారపు వెంకట్రెడ్డి అనారోగ్యానికి గురి కాగా, ఆయన ఇంటికెళ్లి పరామర్శించారు. వర్షకొండలో పదో తరగతి విద్యార్థులకు గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు మామిడి సురేష్రెడ్డి 10వేల చెక్కును ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రభుత్వ ఉపాధ్యాయుడు గడ్డం శ్రీనివాస్రెడ్డికి ఇచ్చారు. కార్యక్రమంలో వైస్ఎంపీపీ నోముల లక్ష్మారెడ్డి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు పోన్కం టి వెంకట్, సర్పంచ్ లింగంపెల్లి గంగాధర్, ఎంపీటీసీ దేశెట్టి శాంత, నాయకులు కంఠం రమేశ్, సింగిరెడ్డి రవికాంత్రెడ్డి, అల్లూరి రఘుపతిరెడ్డి, జగన్, రాజేందర్, గంగారెడ్డి, కాశీరెడ్డి శేఖర్రెడ్డి, జీవన్, పుప్పాల నర్సయ్య, తుక్కారాం, చిన్నరాజన్న, జేడీ సుమన్, చిన్రెడ్డి, నేమూరి సత్యనారాయణ, తోకల శేఖర్, శంకర్ పాల్గొన్నారు.