మల్యాల(కొడిమ్యాల), మార్చి 25 : కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ ఈవోగా దేవదాయ ధర్మాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు.
ఈ సందర్భంగా ఆలయ ఏఈవో అంజయ్య, ఇతర అధికారులు, పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. కాగా, గతంలో ఈవోగా పని చేసిన టంకశాల వెంకటేశం సస్పెండ్ అయిన విషయం తెలిసిందే.