సుల్తానాబాద్, ఫిబ్రవరి 15: ఖోఖో క్రీడకు మహర్దశ పట్టనున్నది. ఖేలో ఇండియాలో భాగంగా క్రీడలకు పుట్టినిల్లు అయిన సుల్తానాబాద్కు ఖోఖో సెంటర్ మంజూరైంది. ఈ విషయాన్న జిల్లా యువజన క్రీడాధికారి ఏ సురేశ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రెండు మూడు రోజుల్లో సుల్తానాబాద్ మార్కండేయ కాలనీలో ఉన్న మినీ స్టేడియంలో శిక్షణకు ఏర్పాటు చేస్తున్నామని, క్రీడాకారులకు ప్రతి రోజూ శిక్షణ ఇస్తామని చెప్పారు.
ఆసక్తి ఉన్న వారు తమ ఆధార్ కార్డు జిరాక్స్తో అంతర్జాతీయ ఖోఖో క్రీడాకారుడు గెల్లు మధుకర్యాదవ్ను సంప్రదించాలని సూచించారు. ఖోఖోలో సుల్తానాబాద్ ప్రాంతవాసులకు ప్రత్యేక గుర్తింపు ఉందని, ఇక్కడి నుంచి ఎంతో మంది క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించిన చరిత్ర ఉందని వివరించారు. కొత్తగా సెంటర్ ఏర్పాటు చేయడంతో మరింత మంది క్రీడాకారులకు లాభం జరుగుతుందని చెప్పారు. వివరాలకు 7995078488 నంబర్లో సంప్రదించాలని ఆయన కోరారు.