ప్రతి సీజన్లో రైతులు ఎదుర్కొంటున్న పెట్టుబడి కష్టాలు తీర్చేందుకు కేసీఆర్ సర్కారు రైతుబంధును తెచ్చింది. 2018 మే 10న కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రారంభించింది. ఇప్పటి వరకు 11 విడుతలుగా సాయం అందించింది.
12వ విడుత టైంలో ఎన్నికలు రావడంతో ఆగిపోయింది. పూర్వ కరీంనగర్ జిల్లాలో ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం చూస్తే 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 9.25,343 మంది రైతులకు 11 విడుతల్లో 7,750.68 కోట్ల చిలుకు మొత్తాన్ని పెట్టుబడి కింద అందించింది.