కరీంనగర్: తెలంగాణచౌక్లో విజయసంకేతం చూపుతున్న టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు , సుడా చైర్మన్ జీవీఆర్, మేయర్ సునీల్రావు, కార్పొరేటర్లు, టీఆర్ఎస్ నాయకులు
గులాబీ గుబాళించింది. మునుగోడు ఉప ఎన్నికలో కనీవినీ ఎరుగని విజయంతో టీఆర్ఎస్(బీఆర్ఎస్) శ్రేణుల్లో ఉత్సాహం వెల్లివిరిసింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో ఆదివారం సాయంత్రం ప్రజాప్రతినిధులు, నాయకులు ఎక్కడికక్కడ రోడ్లపైకి వచ్చి పటాకులు కాల్చి, స్వీట్లు పంచి సంబురాలు చేసుకోవడం పండుగను తలపించింది. ధర్మపురి, కరీంనగర్లో జరిగిన వేడుకల్లో మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ పాల్గొనగా, మహాత్మానగర్లో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ శ్రేణులతో కలిసి విజయోత్సవ ర్యాలీ తీశారు. హుజూరాబాద్, జగిత్యాలలో జడ్పీ చైర్పర్సన్లు విజయ, దావ వసంత పాల్గొన్నారు.
బీజేపీనే బొంద పెట్టారు
తెలంగాణలో రాజకీయ అస్థిరతను సృష్టించాలనే దురుద్దేశంతో బీజేపీ తెచ్చిన మునుగోడు ఉప ఎన్నికలో ప్రజలు ఆ పార్టీనే బొందపెట్టారు. ఇది రాజకీయ కుట్రతో తెచ్చిన ఒక కృత్రిమ ఎన్నిక మాత్రమే. అభివృద్ధి, సంక్షేమ పథకాలతో దేశానికే రోల్ మోడల్గా నిలుస్తున్న సీఎం కేసీఆర్ ఎక్కడ జాతీయ స్థాయిలో తమకు ఇబ్బందికర వాతావరణం సృష్టిస్తాడోననే భయంతో దుర్మార్గమైన ఆలోచనతో ఈ ఎన్నికకు తెరదీశారు. కాంగ్రెస్ నుంచి గెలిచిన రాజగోపాల్రెడ్డికి కాంట్రాక్టుల ఆశచూపి, ఆయనతో రాజీనామా చేయించి ఉపఎన్నికను తెచ్చిన బీజేపీకి సరైన గుణపాఠం నేర్పారు. మునుగోడులో బీజేపీ సెల్ఫ్గోల్ కొట్టుకున్నది. అక్కడ బీజేపీకి ఓట్లు రాలేదు. కేవలం అభ్యర్థి అయిన రాజగోపాల్రెడ్డికి మాత్రమే వచ్చాయి. బీజేపీకి బలం కాదు కదా, కనీసం కేడర్ సైతం లేదు. ఆ పార్టీ జాతీయ స్థాయి నాయకులు, కేంద్ర మంత్రులు, సంఘ్పరివార్, ఇతర రాష్ర్టాల నేతలతో పాటు ఇక్కడి నాయకులు ప్రచారం చేసినా ప్రజలు సీఎం కేసీఆర్ పరిపాలనకు మద్దతు పలికారు. మునుగోడు ఎన్నికతో జాతీయ స్థాయిలో బీజేపీకి సీఎం కేసీఆర్ మాత్రమే ప్రత్యామ్నాయమని తేలిపోయింది. – మంత్రి కొప్పుల ఈశ్వర్
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌక్లో పటాకులు కాలుస్తున్న మంత్రి గంగుల కమలాకర్
బీఆర్ఎస్కు తొలిమెట్టు
మునుగోడు ఉపఎన్నిక గెలుపు బీఆర్ఎస్కు తొలిమెట్టు. సీఎం కేసీఆర్ పనితీరుకు నిదర్శనం. ఇది ఒక అద్భుత విజయం. ఇక నుంచి మేం వెనుదిరిగి చూసే పరిస్థితి లేదు. మునుగోడు గెలుపు మాకు చాలా మనోధైర్యాన్ని ఇస్తుందనడంలో సందేహం లేదు. బీజేపీ నాయకులు అనేక అబద్ధ్దాలు చెప్పి ప్రజలను పక్కదారి పట్టించాలని చూశారు. కానీ, సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న ప్రజలు తమకు ఆయన నాయకత్వమే అవసరమని భావించి టీఆర్ఎస్కు ఈ విజయాన్ని కానుకగా ఇచ్చారు. బీజేపీ నాయకులు అహంకారంతో ప్రజలను మోసం చేయాలని చూసినా మునుగోడు ఓటర్లు వారికి చెంప పెట్టులాంటి తీర్పు ఇచ్చారు. ఢిల్లీ నుంచి వచ్చిన వందల కోట్ల రూపాయలు విచ్చల విడిగా పంచినా, బెదిరింపులకు దిగినా ప్రజలు కేసీఆర్నే విశ్వసించారు. తెలంగాణ గడ్డ మీద బీజేపీకి స్థానం లేదని ఆ పార్టీకి తగిన గుణపాఠం చెప్పారు. బీజేపీకి పడిన ఓట్లు ఆ పార్టీని చూసి పడలేదు. అభ్యర్థిని చూసి పడ్డయ్. హుజూరాబాద్లోనూ ఇదే జరిగింది. ఇక్కడ కూడా బీజేపీకి ఓట్లు లేవు. కేసీఆర్ నాయకత్వం దిన దినం పటిష్టమవుతున్నది.
– మంత్రి గంగుల కమలాకర్
కరీంనగర్, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ): కరీంనగర్లోని తెలంగాణ చౌక్లో మంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సంబురాలు చేసుకున్నారు. టీఆర్ఎస్ నాయకులు స్వీట్లు పంచుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ను రాష్ట్ర ప్రజలు పూర్తిగా విశ్వసిస్తున్నారనేందుకు మునుగోడు ఉప ఎన్నికే నిదర్శనమన్నారు. ఆయన నాయకత్వాన్ని దేశ ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. ఇటు మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆధ్వర్యంలో తిమ్మాపూర్ మండలం మహాత్మానగర్లోని క్యాంపు కార్యాలయంలో పెద్ద ఎత్తున సంబురాలు చేసుకున్నారు. ఎమ్మెల్యే స్వయంగా బైక్ నడుపుతూ ర్యాలీలో పాల్గొని కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు. మానకొండూర్ మండల కేంద్రంలోని పల్లెమీది చౌరస్తాలో గులాబీ నాయకులు పటాకులు పేల్చి సంబురాలు చేసుకున్నారు. హుజూరాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో జరిగిన సంబురాల్లో రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌరస్తాలో జరిగిన సంబురాల్లో జడ్పీ అధ్యక్షురాలు కనుమల్ల విజయ పాల్గొన్నారు. ఇటు చొప్పదండి పట్టణంలో పెద్ద ఎత్తున టీఆర్ఎస్ నాయకులు రోడ్లపైకి వచ్చి పటాకులు పేల్చి సంబురాలు చేసుకున్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో స్వీట్లు తినిపించుకుంటున్న మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ, నాయకురాలు
జమ్మికుంట రూరల్: గాంధీ చౌరస్తాలో విజయసంకేతం చూపుతున్న జడ్పీ చైర్పర్సన్ విజయ, మున్సిపల్ చైర్మన్ రాజేశ్వర్రావు