కోరుట్ల, జనవరి 9: కోరుట్ల మున్సిపల్ మెప్మాలో లోన్డబ్బుల దుర్వినియోగం కేసులో పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుం చి 7 లక్షల నగదు, రెండు సెల్ఫోన్లు, కారును స్వాధీనం చేసుకున్నారు. విచారణలో మరో 85 లక్షల లోన్ డబ్బులు గల్లంతైనట్లుగా పోలీసులు గుర్తించారు. కోరుట్ల ఠాణాలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ రాజశేఖర్రాజు వివరాలు వెల్లడించారు. మున్సిపల్ పరిధిలోని బెండపల్లికి చెందిన మదీనా మహిళా పొదుపు సంఘానికి ఆర్పీగా స్వర్ణలత పని చేస్తున్నారు. డిసెంబర్ 27న ఈ సంఘానికి హెచ్డీఎఫ్సీ బ్యాంకు లింకేజీతో 10 లక్షల లోన్ మంజూరైంది.
లోన్ డబ్బులను సభ్యులకు ఇవ్వకుండా స్వర్ణలత నగదుతో పరారైంది. దీంతో గ్రూప్ సభ్యులు డిసెంబర్ 29న ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఈనెల 8న ఎఖీన్పూర్ శివారులో కారులో వెళ్తున్న స్వర్ణలతతోపాటూ ఆమెకు సహకరించిన కృష్ణను పోలీసులు అదుపులోకి తీ సుకున్నారు. వీరిని విచారించగా మహిళా గ్రూపు లోనేకాకుండా మెట్పల్లిలోని ఓ బ్యాంకు నుంచి 16 మహిళ పొదుపు సంఘాల పేరిట 72 లక్షల లోన్ డబ్బులను నిందితులు డ్రా చేశారని వెల్లడైంది. మహిళా సంఘాలకు లోన్ తీసుకునే క్ర మంలో నిందితులు అన్లైన్ ధ్రువీకరణ పత్రాలు సమర్పించకుండా ఆఫ్లైన్లో పత్రాలు అందించారని సీఐ తెలిపారు. మెట్పల్లి, కోరుట్ల రెండు బ్యాంకుల్లో సుమారు 85 లక్షల మేర లోన్ నిధులు పక్కదారి పట్టాయని సీఐ తెలిపారు. కాగా మెప్మా ఆర్పీ స్వర్ణలత వివిధ బ్యాంకుల నుంచి మహిళ సంఘాల పేరు మీద డ్రా చేసిన రుణాల నుంచి 35 లక్షలు కృష్ణ అనే వ్యక్తికి ఇచ్చినట్లు పేర్కొన్నారు. కోరుట్ల, మేడిపల్లి, కథలాపూర్ ఎస్ఐలు సతీశ్, సుధీర్రావు, రామచంద్రం ఉన్నారు.