మల్యాల, మార్చి 24: కొండగట్టు ఆలయ పరిసరాల చుట్టూ గల కొండచుట్టూ ప్రతినెలా పౌర్ణమి సందర్భంగా
గిరిప్రదక్షిణ నిర్వహిస్తున్నారు. శనివారం చిలుకూరు ఆలయ పూజారి ఆత్మరాం సురేశ్ మహారాజ్ నేతృత్వంలో కొండగట్టు దిగువన గల ఆంజనేయస్వామి విగ్రహం నుంచి 100మంది దీక్షాపరులు, భక్తులతో ప్రారంభమై గిరిప్రదక్షిణ దొంగలమర్రి.
నాచుపల్లి క్రాస్రోడ్, డబ్బుతిమ్మయ్యపల్లి, రాంసాగర్, మద్దుట్ల, రామన్నపేట, నూకపల్లి, మల్యాల ఎక్స్రోడ్ మీదుగా సుమారు 25 కిలోమీటర్ల మేర కొనసాగి కొండగట్టుకు చేరుకున్నది. మద్దుట్లలో కరీంనగర్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్ధి బోయినపల్లి వినోద్కుమార్ పాల్గొని భోజన విరామ సమయంలో భక్తులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా వినోద్కు అర్చకులు ఆశీర్వచనం చేసి సత్కరించారు.