అసెంబ్లీ కమిటీ హాల్లో రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్
అసెంబ్లీ కమిటీ హాల్లో సోమవారం రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ నిర్వహించగా, ఉమ్మడి జిల్లాలోని మంత్రులు కేటీఆర్, కొప్పుల ఈశ్వర్తోపాటు తొమ్మిది ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. కరోనాతో మంత్రి గంగుల కమలాకర్, విదేశాల్లో ఉండడంతో ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు ఓటు వేయలేకపోగా.. మిగతా వారంతా వేశారు.
చిగురుమామిడి/తిమ్మాపూర్ రూరల్, జూలై 18 : రాష్ట్రపతి ఎన్నికల్లో ఉమ్మడి జిల్లా పరిధిలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. హైదరాబాద్లోని అసెంబ్లీ కమిటీ హాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో మంత్రులు కేటీఆర్, కొప్పుల ఈశ్వర్తోపాటు మిగతా ఎమ్మెల్యేలు ఓటు వేశారు. కాగా, కరోనా కారణంగా మంత్రి గంగుల కమలాకర్, విదేశాల్లో ఉండడంతో ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు ఓటు హక్కు వినియోగించు కోలేకపోయారు. పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేతకాని పార్లమెంట్లోని పోలింగ్ బూత్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఓటు హక్కు వినియోగించుకునేందుకు అసెంబ్లీకి వస్తున్న మంత్రులు కేటీఆర్