పెద్దపల్లి కమాన్, జూన్ 26: పంతాల కన్నా కేసులను పరిష్కరించుకోవడమే మిన్నని జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎం నాగరాజు పేర్కొన్నారు. రంగంపల్లిలోని జిల్లా ప్రధాన న్యాయస్థానంలో ఆదివారం నిర్వహించిన జాతీయ మెగా లోక్ అదాలత్కు భారీ స్పందన వచ్చింది. దరఖాస్తు చేసుకున్న పలు కేసులను జడ్జి పరిష్కరించి మాట్లాడారు. లోక్ అదాలత్లో కేసులకు సత్వర పరిష్కారం దొరుకుతుందన్నారు. గొడవలు పడి ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకుని ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరుగుతూ డబ్బులు, సమయాన్ని వృథా చేసుకోవద్దని పేర్కొన్నారు. క్షణికావేశాలకు పోయి భవిష్యత్ను నాశనం చేసుకోవద్దని జడ్జి సూచించారు. పెద్దపల్లి జూనియర్ జడ్జి కోర్టు పరిధిలో మొత్తం 497 కేసులను పరి ష్కరించినట్లు జడ్జి తెలిపారు. పెద్దపల్లి జూనియర్ సివిల్ జడ్జి రాణి, గోదావరిఖని మెజిస్ట్రేట్ భార్గవి, మంథని అడిషనల్ సివిల్ జడ్జి స్వాతి, పెద్దపల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సురేశ్బాబు, లోక్ అదాలత్ సభ్యులు కిశోర్, రెడ్డి శంకర్, శ్రీధర్, బాబ్జి సంతోష్, న్యాయవాదులు బర్ల రమేశ్ బాబు, జీ సత్యనారాయణ, కుమారస్వామి, శ్రీనివాస్ పాల్గొన్నారు.
1063 కేసులు పరిష్కారం
సుల్తానాబాద్, జూన్ 26 : మండల న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో సుల్తానాబాద్ కోర్టులో లోక్ అదాలత్ను నిర్వహించారు. 250 కేసులను పరిష్కరించారు. కార్యక్రమంలో సుల్తానాబాద్ మున్సిఫ్ కోర్టు సివిల్ జడ్జి పార్థసారథిరావు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పడాల శ్రీరాములు, ప్రధాన కార్యదర్శి పెగడ శ్యాంసుందర్, ఏపీపీ శ్యాంప్రసాద్రావు, ఏజీపీ మేకల తిరుపతిరెడ్డి, న్యాయవాదులు పబ్బతి లక్ష్మీకాంతరెడ్డి, అలూరి శ్రీనివాసరావు, జోగుల రమేశ్, ఎస్ఐ ఉపేందర్రావు, ఆవుల లక్ష్మీరాజం, గూడెపు దివాకర్రావు, ఆకారపు సర్వోత్తమ్రెడ్డి, వోడ్నాల రవీందర్, నల్లవెల్లి రాజయ్య, పడాల అంజయ్య, ఆవునూరి సత్యనారాయణ, దూడం ఆంజనేయులు, సామల రాజేంద్రప్రసాద్, ఆవుల శివకృష్ణ, కోర్టు సిబ్బంది, పోలీసుల పాల్గొన్నారు.
సత్వర న్యాయం
ఫర్టిలైజర్సిటీ, జూన్ 26: లోక్ అదాలత్లతో సత్వర న్యాయం సాధ్యపడుతున్నదని గోదావరిఖని 1వ అదనపు మున్సిఫ్ మెజిస్ట్రేట్ దుర్గం గణేశ్, 2వ అదనపు మున్సిఫ్ మెజిస్ట్రేట్ జీఎస్ఎల్ ప్రియాంక తెలిపారు. జాతీయ లోక్ అదాలత్ను పురస్కరించుకొని ఆదివారం గోదావరిఖని మున్సిఫ్ కోర్టు కాంప్లెక్స్తోపాటు జిల్లా కోర్టులో నిర్వహించిన లోక్ అదాలత్కు వారు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఇక్కడ గోదావరిఖని అసిస్టెంట్ పీపీ నంది రవీందర్, అదాలత్ సభ్యులు సీహెచ్ శైలజ, శంతన్ కుమార్, భూమయ్య, అనురాధ, గోపాల్ రెడ్డి, గుల్ల రమేశ్తోపాటు సీనియర్, జూనియర్ న్యాయవాదులు ప్రదీప్ కుమార్, ముచ్చకుర్తి కుమార్, చంద్రశేఖర్, రాజ్కుమార్, కిషన్ రావు, రాజేందర్, ఉమర్, ప్రకాశ్, ముస్కె రవికుమార్, అనిల్కుమార్, షానవాజ్, కోర్టు సిబ్బంది ఉన్నారు. గోదావరిఖని ఏసీపీ గిరి ప్రసాద్, సీఐలు రమేశ్బాబు, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
రూ.11లక్షల జరిమానా
రామగుండం ట్రాఫిక్ పీఎస్ పరిధిలో కొంత కాలంగా నిర్వహించిన డ్రంకన్ డ్రైవ్ తనిఖీల్లో పోలీసులకు చిక్కిన మందుబాబులకు రామగుండం ట్రాఫిక్ పోలీసులు ఆదివారం పోలీస్ స్టేషన్ ఆవరణలో కౌన్సెలింగ్ చేశారు. అనంతరం 580 మంది మందుబాబులను గోదావరిఖని 2వ అదనపు మున్సిఫ్ మెజిస్ట్రేట్ జీఎస్ఎల్ ప్రియాంక ఎదుట హాజరుపర్చగా, ఒక్కొక్కరికీ రూ.2వేల చొప్పున మొత్తం రూ.11.60 లక్షల జరిమానా విధించారు. ఇక్కడ ఎస్ఐలు నాగరాజు, కమలాకర్, రాజేందర్, శ్రీనివాస్ న్నారు.
మంథనిలో..
మంథని టౌన్, జూన్ 26: మంథని కోర్టు ఆవరణలో 875 సివిల్ కేసులను కక్షి దారులు పరిష్కరించుకున్నారు. కార్యక్రమంలో మంథని సీనియర్ సివిల్ జడ్జి వరూధిని, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎం. శ్రీధర్, ఎస్ఐ వెంకటేశ్వర్లు, న్యాయ వాదులు పాల్గొన్నారు.